Karnataka Minister: ‘‘ఉగ్రవాదులు మతాన్ని అడగలేదు’’.. పహల్గామ్ దాడిపై కాంగ్రెస్ మంత్రి కామెంట్స్..
- ‘‘ ఉగ్రవాదులు మతాన్ని అడగలేదు’’..
- పహల్గామ్ దాడిపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలంటూ బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Minister: పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో అమాయకపు టూరిస్టులు 26 మంది మరణించారని యావత్ దేశం తీవ్ర బాధలో ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుంబంధ టీఆర్ఎఫ్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఈ దాడికి పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేస్తూ ముష్కరులు టార్గెట్ చేయడాన్ని భారత సమాజం తీవ్రంగా ఖండిస్తోంది.
ఇదిలా ఉంటే, కొందరు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పాకిస్తాన్తో యుద్ధం వద్దని చెప్పడం వివాదాస్పదమైంది. ఇప్పుడు ఆయన క్యాబినెట్లోని మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఉగ్రవాదులు దాడికి పాల్పడే ముందు వారి మతాన్ని అడిగారని నేను అనుకోవడం లేదని అన్నారు.
Also Read
Read Also: Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. టెర్రరిస్టుల ఎలా వచ్చారంటే..?
కర్ణాటక ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ మీడియాతో మాట్లాడుతూ.. కాల్చుతున్న వ్యక్తి కులం, మతం అడుగుతాడా..? అతను కాల్చి వెళ్లిపోతాడు, ఒకసారి సరిగా ఆలోచించండి. ఉగ్రవాది అక్కడ నిలబడి మతాన్ని అడగడు.’’ అని అన్నారు. ఈ దారుణమైన దాడిప దేశం కలత చెందుతోందని చెబుతూనే, దీనిని మతపరమైన సమస్యగా చిత్రీకరించడానికి కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించాడు. ‘‘వారు ఉగ్రవాద దాడి చేస్తున్నప్పుడు మతం అడిగలేదని నేను భావిస్తున్నాను. వారు అలా చేస్తే, మతం ఆధారంగా సమస్యను రాజకీయం కాకూడదు’’ అని మంత్రి చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి తిమ్మాపూర్ అనాగరికమైన, దుష్టమై వ్యాఖ్యలు బాధిత కుటుంబాల సమగ్రతను అవమానించాయని అన్నారు. ఇలాంటి సమయంలో కూడా మతపరమైన, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనస్సాక్షిని తాకట్టు పెట్టి, మతతత్వ కాంగ్రెస్ పార్టీ వ్యాపారం చేస్తుందని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!