Karnataka Minister: “భగవద్గీత”మతపరమైన బుక్ కాదు.. డిసెంబర్ నుంచి పాఠశాలల్లో బోధన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagavad Gita teachings in Karnataka schools from December: డిసెంబర్ నుంచి కర్ణాటక పాఠశాలల్లో కీలక ఘట్టం మొదలుకానుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాల్లలో నైతిక విద్యలో భాగంగా ‘ భగవద్గీత’ను బోధించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే భగద్గీత బోధిస్తే ఖురాన్ ను ఎందుకు బోధించరని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఖురాన్ మతపరమైన గ్రంథమని.. భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని.. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు. భగవంతుని ఆరాధన గురించి భగవద్గీతలో ఉండదని.. మతపరమైన ఆచారాలను గురించి భగవద్గీత చెప్పదని.. కేవలం నైతికత గురించి మాత్రమే బోధిస్తుందని ఆయన అన్నారు. ఇది విద్యార్థులకు ప్రేరణ, స్ఫూర్తిని ఇస్తుందని ఆయన అన్నారు.
Read Also: Special Story on Gautam Adani: గౌతమ్ అదానీకి ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా వచ్చింది?
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
స్వాతంత్య్ర సమరయోధులు కూడా గీత నుంచి ప్రేరణ పొంది పోరాడారని ఆయన అన్నారు. శాసన మండలిలో ఎంకే ప్రాణేస్ అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ మంత్రి నగేష్ ఈ వ్యాక్యలు చేశారు. భగవద్గీతను ప్రత్యేక పాఠ్యాంశంగా బోధించాలనే ప్రతిపాదన విరమించుకున్నామని..అయితే అందులోని బోధనలు నైతిక విద్యలో భాగంగా ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికే నిపుణుల కమిటీని నియమించిందని.. వారి సూచనలు, సిఫార్సుల మేరకు డిసెంబర్ నుంచి పాఠశాలల్లో గీత బోధనలు ప్రారంభం అవుతాయిన ఆయన వెల్లడించారు.
కర్ణాటకలోని స్థానిక రాజులు, రాష్ట్రానికి సంబంధించిన విషాయాలను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. స్థానిక రాజులు, రాజ్యాల పాఠ్యాంశాలను 6 నుంచి 10 తరగతుల సోషల్ స్టడీస్ పాఠ్యాంశాల్లో చేరస్తామని తెలిపారు. గంగా, హోయసలు, మైసూర్ వడియార్, విజయపుర సామ్రాజ్యం, శాతవాహన, కళ్యాని చాళుక్య, బహమనీ, విజయనగరం, సురపుర నాయక, హైదరాలీ-టిప్పు సుల్తాన్, తుళునాడు, యలహంక నాడ ప్రభు, చిత్రదుర్గ వీరులకు సంబంధించిన వీరుల పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. భగవద్గీత పాఠ్యాంశంలో భాగం కానప్పటికీ.. దాని ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాక మంత్రి నగేష్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?