Parole to marry girlfriend: హత్య కేసులో నిందితుడు.. గర్ల్ఫ్రెండ్ను పెళ్లాడేందుకు పెరోల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parole to marry girlfriend:ఇటీవల అత్యాచార కేసులో నిందితుడైన యువకుడికి బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఓ కోర్టు. పోలీసులు, అధికారులు సమక్షంలో అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి కేసే తెరపైకి వచ్చింది. హత్యకేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కర్ణాటక హైకోర్టు 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది. తన కొడుకు ప్రేమించిన అమ్మాయికి వేరేవారితో పెళ్లి అవుతుందనే భయంతో కోర్టును ఆశ్రయించింది. అసాధారణ పరిస్థితిగా పరిగణించిన కర్ణాటక హైకోర్టు దోషికి పెరోల్ మంజూరు చేసింది.
Read Also: Car Sales in FY23:: ఎఫ్వై 23లో రికార్డు కార్ సేల్స్.. ఈ కార్ల కంపెనీల అమ్మకాల్లో వృద్ధి..
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
అయితే ప్రభుత్వ న్యాయవాది.. పెళ్లి చేసుకోవడానికి పెరోల్ మంజూరు చేసే నిబంధన లేదని కోర్టులో వాదించారు. అయితే దోషి ఆనంద్ కు పెరోల్ ను మంజూరు చేసే అసాధారణ పరిస్థితిగా దీనిని జస్టిస్ ఎం నాగప్రసన్న పరిగణించి పెరోల్ ఇచ్చారు. ఆనంద్ తల్లి రత్నమ్మ, ప్రేమికురాలు నీతా పెరోల్ పిటిషన్ తో హైకోర్టును ఆశ్రయించారు. 30 ఏళ్ల నీతా తనకు మరొకరితో వివాహం జరుగుతోందని, అందువల్ల తనను పెళ్లి చేసుకోవడానికి ఆనంద్ కు పెరోల్ మంజూరు చేయాలని పిటిషన్ లో పేర్కొంది.
గత 9 ఏళ్లుగా ఆనంద్ తో ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది. హత్య కేసులో ఆనంద్ కు జీవిత ఖైదు విధించబడింది. ఆ తరువాత దీన్ని 10 ఏళ్ల జైలు శిక్షగా తగ్గించారు. ప్రస్తుతం అతడు 6 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్నాడు. నిర్భంధంలో ఉన్న వ్యక్తి విడుదల తప్పనిసరి అని.. జైలులో ఉన్న అతను, తను ప్రియురాలు వేరే వివాహం చేసుకుంటే భరించలేడని, జీవితంలో ప్రేమను కోల్పోతాడని, అందువల్ల అతనికి పెరోల్ ఇస్తున్నట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 20 సాయంత్రం వరకు దోషి ఆనంద్ ను పెరోల్ పై విడుదల చేయాలని జైళ్ల డిప్యూటీ ఐజీ, పరప్పర అగ్రహార జైల్ చీఫ్ సూపరింటెండెంట్ ను కోర్టు ఆదేశించింది. మళ్లీ జైలుకు తిరిగి వచ్చేందుకు, పెరోల్ వ్యవధిలో ఇతర నేరాలకు పాల్పడకుండా కఠిన షరతులు విధించాలని అధికారులను ఆదేశించింది.
తాజావార్తలు
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!