Bengaluru stampede case: ఆర్సీబీ తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు..
- ఆర్సీబీ తొక్కిసలాట ఘటన.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..
- 9 ప్రశ్నల్ని సంధించిన హైకోర్టు.. సమాధానాలు చెప్పాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru stampede case: బెంగళూర్లో ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొక్కిసలాట కేసులో అరెస్టులకు సంబంధించిన పిటిషన్లు విచారిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. జవాబుదారీతనం కోసం కోర్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, దాని పర్యవసానాలపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తింది. కర్ణాటక ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని సూటిగా ప్రశ్నించింది.
ఈ ఘటన దర్యాప్తును సీఐడీకి బదిలీ చేసినట్లు కోర్టుకు సమాచారం అందింది. అయితే, ఇప్పటి వరకు బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టులు చేసింది. నిందితులను కబ్బన్ పార్క్ పోలీసులు హాజరుపరుస్తున్నారు.
Also Read
- PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
- IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే...! IVF ముసుగులో ఇంత దారుణమా
- Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
- Radhamohan Mishra: తానే దేవుడి స్వరూపమని చెప్పుకుంటూ.. మహిళను ఏళ్ల తరబడి హింసించి అత్యాచారం.. మూత్రం తాగాలని బలవంతం
హైకోర్టు ప్రభుత్వానికి సంధించిన 9 ప్రశ్నలు:
1) విజయోత్సవ వేడుకల్ని ఎప్పుడు, ఎవరు ఏ విధంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు..?
2) ట్రాఫిక్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకున్నారు..?
3) వేదిక వద్ద వైద్య, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారా..?
4) వేడుక సమయంలో ఎంత మంది వ్యక్తులు, ఎవరు ఉండవచ్చనే దానిపై ముందస్తు అంచనా వేశారా..?
5) గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడానికి ఎంత సమయం పట్టింది..?
6) ఈ తరహా క్రీడా కార్యక్రమం లేదా వేడుకల్లో 50,000 మరియు అంతకంటే ఎక్కువ మంది జనసమూహాన్ని నిర్వహించడానికి ఏదైనా SOP (ప్రామాణిక ఆపరేటింగ్ విధానం) రూపొందించబడిందా?
7) ఈవెంట్ నిర్వహించడానికి ఏదైనా అనుమతి కోరారా..?
8) ప్రజల్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?
9) గాయపడిన వారికి వెంటనే వైద్య సౌకర్యం అందించారా..? లేకుంటే ఎందుకు..?
దీనికి ప్రతిస్పందనగా, రాష్ట్రం సమాధానాలను దాఖలు చేయడానికి సమయం కోరింది. వీటిని సీల్డ్ కవర్లో సమర్పించాలని భావిస్తున్నారు. సోమవారం, తొక్కిసలాటకు సంబంధించి అరెస్టయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారి నిఖిల్ సోసాలే తన అరెస్టు చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. ఈవెంట్ నిర్వాహక సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్లో, ముఖ్యమంత్రి అందరినీ సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించారని పేర్కొంది.
తాజావార్తలు
-
Best Bikes: బడ్జెట్ ధరలో.. రోజువారీ ప్రయాణానికి బెస్ట్ బైక్స్..
-
IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు!
-
FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
-
Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
-
PM Modi: నేటితో 56వ వసంతంలోకి రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ ఆసక్తికర పోస్ట్..
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!