KA Paul: కేఏ పాల్ వార్నింగ్.. ఆమరణ నిరాహారదీక్ష చేపడతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Comments On Delhi Liquor Scam And BBC ED Raids: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సచివాలయాన్ని ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభిస్తామని మరో మూడు రోజుల్లో ప్రకటించకపోతే.. ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట అంబేద్కర్ మద్దతుదారులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. తాను కూడా ఢిల్లీ లేదా హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. దళితుల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని, ఇచ్చిన హామీల్ని అమలుపరచలేదని ఆరోపించారు. ఇదే సమయంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అతిత్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ కేఏ పాల్ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ దేశ్కి నేత అయినంత మాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరన్నారు. అసలు కేసీఆర్ దేశ్కి నేత కాదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఖమ్మం సభకు వచ్చిన ముఖ్యమంత్రులకు డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు, నేతలు అంతా బానిసలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Talasani Srinivas Yadav: తెలంగాణలో హంగు, బొంగు ఏమీ రాదు
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
అలాగే.. బీబీసీపై ఐడీ రైడ్స్ చేయడానికి కారనం, గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీయడమేనని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 9 ఏళ్లలో బీజేపీలో పాలనలో దేశ ప్రతిష్ఠ దిగజారిందని పేర్కొన్నారు. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? అని సందేహం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదని.. డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్ళాలని సూచించారు. అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియాతో యుద్ధం చేయొద్దని మోడీకి సలహా ఇచ్చారు. మోడీ, అమిత్ షా, విదేశాంగ శాఖ.. అంతర్జాతీయ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ మీడియాతో రాజకీయాలు చేయొద్దని, లేకపోతే ఇది దేశానికే ప్రమాదం అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు.
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల రిమాండ్
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!