KA Paul: కేఏ పాల్ వార్నింగ్.. ఆమరణ నిరాహారదీక్ష చేపడతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Comments On Delhi Liquor Scam And BBC ED Raids: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సచివాలయాన్ని ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభిస్తామని మరో మూడు రోజుల్లో ప్రకటించకపోతే.. ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట అంబేద్కర్ మద్దతుదారులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. తాను కూడా ఢిల్లీ లేదా హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. దళితుల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని, ఇచ్చిన హామీల్ని అమలుపరచలేదని ఆరోపించారు. ఇదే సమయంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అతిత్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ కేఏ పాల్ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ దేశ్కి నేత అయినంత మాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరన్నారు. అసలు కేసీఆర్ దేశ్కి నేత కాదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఖమ్మం సభకు వచ్చిన ముఖ్యమంత్రులకు డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు, నేతలు అంతా బానిసలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Talasani Srinivas Yadav: తెలంగాణలో హంగు, బొంగు ఏమీ రాదు
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
అలాగే.. బీబీసీపై ఐడీ రైడ్స్ చేయడానికి కారనం, గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీయడమేనని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 9 ఏళ్లలో బీజేపీలో పాలనలో దేశ ప్రతిష్ఠ దిగజారిందని పేర్కొన్నారు. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? అని సందేహం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదని.. డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్ళాలని సూచించారు. అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియాతో యుద్ధం చేయొద్దని మోడీకి సలహా ఇచ్చారు. మోడీ, అమిత్ షా, విదేశాంగ శాఖ.. అంతర్జాతీయ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ మీడియాతో రాజకీయాలు చేయొద్దని, లేకపోతే ఇది దేశానికే ప్రమాదం అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు.
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల రిమాండ్
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!