KA Paul: కేఏ పాల్ వార్నింగ్.. ఆమరణ నిరాహారదీక్ష చేపడతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Comments On Delhi Liquor Scam And BBC ED Raids: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సచివాలయాన్ని ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభిస్తామని మరో మూడు రోజుల్లో ప్రకటించకపోతే.. ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట అంబేద్కర్ మద్దతుదారులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. తాను కూడా ఢిల్లీ లేదా హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. దళితుల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని, ఇచ్చిన హామీల్ని అమలుపరచలేదని ఆరోపించారు. ఇదే సమయంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అతిత్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ కేఏ పాల్ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ దేశ్కి నేత అయినంత మాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరన్నారు. అసలు కేసీఆర్ దేశ్కి నేత కాదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఖమ్మం సభకు వచ్చిన ముఖ్యమంత్రులకు డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు, నేతలు అంతా బానిసలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Talasani Srinivas Yadav: తెలంగాణలో హంగు, బొంగు ఏమీ రాదు
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Punjab: ఆప్లోకి గ్యాంగ్స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
అలాగే.. బీబీసీపై ఐడీ రైడ్స్ చేయడానికి కారనం, గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీయడమేనని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 9 ఏళ్లలో బీజేపీలో పాలనలో దేశ ప్రతిష్ఠ దిగజారిందని పేర్కొన్నారు. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? అని సందేహం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదని.. డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్ళాలని సూచించారు. అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియాతో యుద్ధం చేయొద్దని మోడీకి సలహా ఇచ్చారు. మోడీ, అమిత్ షా, విదేశాంగ శాఖ.. అంతర్జాతీయ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ మీడియాతో రాజకీయాలు చేయొద్దని, లేకపోతే ఇది దేశానికే ప్రమాదం అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు.
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల రిమాండ్
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!