Supreme Court Collegium: సుప్రీంకోర్టు కొలీజియం బదిలీల్లో జస్టిస్ హేమంత్ ప్రచ్చక్.. 23 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
Supreme Court Collegium: సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు జడ్జిల బదిలీలకు సిఫారసు చేసింది. బదలీల్లో 23 మంది హైకోర్టు జడ్జిలు ఉన్నారు. వారిలో గుజరాత్ హైకోర్టు జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ కూడా ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి సిఫార్సులు చేసింది. 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం రెండు సమావేశాల్లో నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3న జరిగిన సమావేశంలో 9 మంది న్యాయమూర్తులను, ఆగస్టు 10న నిర్వహించిన సమావేశంలో మరో 14 మంది న్యాయమూర్తుల బదిలీలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకుంది.
Read also: Mahesh Babu: బాబు ల్యాండింగ్.. ఇక రచ్చ షురూ
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
బదిలీలు పొందుతున్న వారిలో గుజరాత్ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ కూడా ఉన్నారు. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను గత నెల జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ తిరస్కరించారు. తీర్పుపై స్టే విధించడానికి సహేతకమైన కారణం లేదని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానిస్తూ స్టే ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీం ధర్మాసనం సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సైతం పాల్గొన్న విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించిన జాబితాను గత రాత్రి సుప్రీంకోర్టు తన అధికారి వెబ్సైట్లో ఉంచింది. ‘మెరుగైన న్యాయం కోసం’ బదిలీలను కొలీజియం సిఫార్సు చేసినట్టు ప్రకటించింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్..గతంలో 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ మాంత్రి మాయ కోద్నానీ లాయర్ల బృందంలో ఓ సభ్యుడు. గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన జస్టిస్ ప్రచ్చక్.. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించగా.. 2019 వరకూ అదే పదవిలో ఉన్నారు. తరువాత 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ప్రచ్చక్తో పాటు 2002 గోద్రా అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పారని ఆరోపిస్తూ తనపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ తీస్తా సెతల్వాద్ చేసిన అభ్యర్థనపై విచారణకు నిరాకరించిన జస్టిస్ సమీర్ దవేను, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ వేసిన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపిని కూడా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. వారితోపాటు పంజాబ్ హరియాణా హైకోర్టుకు చెందిన నలుగురు, అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒకరు కొలీజియం బదిలీలకు సిఫార్సు చేసిన జాబితాలో ఉన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో