Supreme Court Collegium: సుప్రీంకోర్టు కొలీజియం బదిలీల్లో జస్టిస్ హేమంత్ ప్రచ్చక్.. 23 మంది హైకోర్టు జడ్జిల బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Collegium: సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు జడ్జిల బదిలీలకు సిఫారసు చేసింది. బదలీల్లో 23 మంది హైకోర్టు జడ్జిలు ఉన్నారు. వారిలో గుజరాత్ హైకోర్టు జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ కూడా ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి సిఫార్సులు చేసింది. 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం రెండు సమావేశాల్లో నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3న జరిగిన సమావేశంలో 9 మంది న్యాయమూర్తులను, ఆగస్టు 10న నిర్వహించిన సమావేశంలో మరో 14 మంది న్యాయమూర్తుల బదిలీలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకుంది.
Read also: Mahesh Babu: బాబు ల్యాండింగ్.. ఇక రచ్చ షురూ
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
బదిలీలు పొందుతున్న వారిలో గుజరాత్ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ కూడా ఉన్నారు. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను గత నెల జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ తిరస్కరించారు. తీర్పుపై స్టే విధించడానికి సహేతకమైన కారణం లేదని జస్టిస్ హేమంత్ వ్యాఖ్యానిస్తూ స్టే ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీం ధర్మాసనం సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించడంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సైతం పాల్గొన్న విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించిన జాబితాను గత రాత్రి సుప్రీంకోర్టు తన అధికారి వెబ్సైట్లో ఉంచింది. ‘మెరుగైన న్యాయం కోసం’ బదిలీలను కొలీజియం సిఫార్సు చేసినట్టు ప్రకటించింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్..గతంలో 2002 గుజరాత్ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ మాంత్రి మాయ కోద్నానీ లాయర్ల బృందంలో ఓ సభ్యుడు. గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన జస్టిస్ ప్రచ్చక్.. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. మోడీ ప్రధాని అయిన తర్వాత 2015లో గుజరాత్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించగా.. 2019 వరకూ అదే పదవిలో ఉన్నారు. తరువాత 2021లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ప్రచ్చక్తో పాటు 2002 గోద్రా అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పారని ఆరోపిస్తూ తనపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ తీస్తా సెతల్వాద్ చేసిన అభ్యర్థనపై విచారణకు నిరాకరించిన జస్టిస్ సమీర్ దవేను, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ వేసిన పిటిషన్పై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ గీతా గోపిని కూడా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. వారితోపాటు పంజాబ్ హరియాణా హైకోర్టుకు చెందిన నలుగురు, అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒకరు కొలీజియం బదిలీలకు సిఫార్సు చేసిన జాబితాలో ఉన్నారు.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!