Mahabubabad: అరుదైన ఘటన.. సర్పంచ్గా పోటీ చేయాలని మహిళ కాళ్లపై పడి వేడుకున్న గ్రామస్తులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad: రాష్ట్రంలో వెలుబడిన పంచాయితీ ఏన్నికల నోటిఫికేషన్ తో గ్రామాల్లో రాజకీయ కోలాహలం కనిపిస్తుంది. ఇందులో భాగంగా రోజుకొక కొత్త సమాసం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే తాజగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ విచిత్రమైన, భావోద్వేగపూరిత దృశ్యం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఓ మహిళ కాళ్లపై పడి ఆమెను ఓటు కోసం కోరుతున్నట్లు కనిపించినా… అసలు విషయం మాత్రం పూర్తిగా వేరే. గ్రామ పంచాయతి ఎన్నికల్లో భాగంగా ఈసారి దాట్ల గ్రామానికి జనరల్ మహిళ కేటగిరీలో సర్పంచ్ పదవి కేటాయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తమ గ్రామానికి మంచి నేతగా నిలదొక్కుకునేలా రాములమ్మను సర్పంచ్గా పోటీ చేయాలని కోరుతున్నారు.
Cars Launches in December: భారత రోడ్లపైకి రాబోతున్న కొత్త కార్లు ఇవే.. లిస్ట్ పెద్దదే సుమీ..!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
అయితే ఇక్కడ సమస్య ఏమి ఏమిటంటే.. కాంగ్రెస్కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడి భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండడంతో, ఆమెకు పోటీ చేసే హక్కు లేదు. దీంతో ఆ మాజీ ఎంపీటీసీ సభ్యుడి అమ్మ రాములమ్మకు ఎన్నిసార్లు చెప్పినా, కొడుకు ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. దీనితో చివరకు గ్రామ కార్యకర్తలు, స్థానికులు కలిసి రాములమ్మ ఇంటికి వెళ్లి.. ఆమె కాళ్లపై పడి, గ్రామం కోసం అయినా సర్పంచ్గా పోటీ చేయమని వేడుకున్నారు. అయినా కానీ ఆమె ఎంతగా నిరాకరించినా, గ్రామస్తుల పట్టు వదలలేదు. చివరకు రాములమ్మ ఎన్నికల బరిలో నిలబడేందుకు అంగీకరించినట్లు సమాచారం.
Internal Conflict In Team India: టీమిండియాలో అంతర్గత పోరు.. గంభీర్, కోహ్లీ, రోహిత్ మధ్యే..?
ఈ మొత్తం ఘటనను అక్కడ ఉన్న వారు వీడియోగా రికార్డ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. మహిళ కాళ్లపై పడి పడే ఆ దృశ్యం నెటిజన్లను షాక్కు గురిచేస్తోంది. గ్రామ రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో జనరల్ మహిళకు రిజర్వేషన్ వచ్చింది. దింతో కొమ్మినేని రాములమ్మ అనే మహిళ కాళ్లపై పడి సర్పంచ్ నామినేషన్ వేయాలని కోరిన వ్యక్తి.మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి రాములమ్మను సర్పంచ్గా నామినేషన్ వేయాలని వేడుకున్న ప్రజలు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!