Montra E-27 Tractor Launch: భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జింగ్పై 4.5 గంటల రన్టైమ్!
- రైతులకు ప్రతి సీజన్ ఓ సవాలే
- పెను భారంగా మారుతున్న పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు
- భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశానికి వెన్నెముకైన రైతులకు ప్రతి సీజన్ ఓ సవాలే. ముఖ్యంగా పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు పెను భారంగా మారుతున్నాయి. విత్తనాలు విత్తడం నుంచి పంటలు కోయడం వరకు.. రైతులకు ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో డీజిల్ ధర పెరగడం కూడా రైతు లాభాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇప్పుడు డీజిల్ అవసరం లేని ట్రాక్టర్ భారత మార్కెట్లోకి వచ్చింది. బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ ‘మోంట్రా E27’ ట్రాక్టర్ ఫుల్ డీటెయిల్స్ ఓసారి తెలుసుకుందాం.
మోంట్రా ఎలక్ట్రిక్ విభాగం ఉత్తర భారతదేశంలో తన మొట్టమొదటి ARAI-సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ E-27ను విడుదల చేసింది. అత్యంత శక్తివంతమైన, అధునాతన సాంకేతికతతో వచ్చిన మోంట్రా E27 ట్రాక్టర్లో పొగ, శబ్దం అసలే ఉండవు. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.10.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 10 రాష్ట్రాలలో 17 డీలర్షిప్లలో అందుబాటులో ఉంది. రైతులకు సులభమైన ఆర్థిక సౌకర్యాలను అందించడానికి కంపెనీ అనేక సంస్థలతో చేతులు కలిపిందని కంపెనీ సీఈఓ హరీష్ ప్రసాద్ తెలిపారు. ఈ ట్రాక్టర్ ప్రత్యేకత ఏమిటంటే.. టూ-వీల్ డ్రైవ్ (2WD), ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) రెండు ఎంపికలలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను ఉపయోగిస్తే.. రైతులు 5 సంవత్సరాలలో రూ.10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
Also Read
- Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
- Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
Also Read: Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్.. 2027 వన్డే వరల్డ్కప్లో రో-కో!
కంపెనీ ప్రకారం.. మోంట్రా E-27 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ చాలా తక్కువ శబ్దం, కంపనలను కలిగి ఉంటుంది. ఇది ఆపరేటర్కు (డ్రైవర్) ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తుంది. డ్రైవర్ ఎక్కువ గంటలు పని చేసినా అలసట ఉండదని కంపనీ పేర్కొంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ద్వారా 27 HP శక్తిని, 90 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. పొలాల్లో దున్నడం, పిచికారీ చేయడం, ట్రాలీ పనుల కోసం చాలా ఈ ట్రాక్టర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ట్రాక్టర్ 22.37 kWh LFP ప్రిస్మాటిక్-సెల్ బ్యాటరీ ప్యాక్ ద్వారా రన్ అవుతుంది. ఇది దాదాపు 4.5 గంటల రన్టైమ్ను అందిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 2.15 గంటలు పడుతుంది. డీజిల్ ట్రాక్టర్తో పోలిస్తే.. దీని నిర్వహణ వ్యయం దాదాపు 70 శాతం తగ్గుతుందని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!