Law Minister Kiren Rijiju: న్యాయవ్యవస్థ ప్రజా విమర్శలకు దూరంగా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Law Minister Kiren Rijiju: భారత న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నాయని ప్రపంచానికి తప్పుగా చాటి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరన్ రిజిజు అన్నారు. శనివారం తూర్పు రాష్ట్రాల్లోని కేంద్ర న్యాయవాదుల సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల విజ్ఞత ప్రజల పరిశీలనకు మించినదని ఆయన అన్నారు. భారత న్యాయవ్యవస్థను ప్రశ్నించలేమని, ముఖ్యంగా న్యాయమూర్తుల విజ్ఞతను ప్రజల పరిశీలనలో ఉంచలేమని వ్యాఖ్యానించారు.
భారత న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని చెప్పడానికి కొన్ని సార్లు దేశం లోపల, వెలుపల కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోందని అన్నారు. ఇలాంటివి ఎప్పటికీ విజయం సాధించవని స్పష్టం చేశారు. అమెరికాను అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పువచ్చు, కానీ భారతదేశం నిజంగా ‘‘ప్రజాస్వామ్యానికి తల్లి’’ అని అభివర్ణించారు. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు కిరన్ రిజిజు.
Also Read
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
Read Also: Chennai: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా ఎల్ఈడీ లైట్లతో గంజాయి సాగు..
సోషల్ మీడియాలో న్యాయమూర్తులు దుర్భాషలాడడం దురదృష్టకరమని, భారత న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుందో కొంతమందికి తెలియకపోవడం వల్లే ఇలా జరుగుతోందని రిజిజు అన్నారు. న్యాయవ్యవస్థ ఒకరకమైన విమర్శలకు గురవ్వడం మంచి సంకేతం కాదని.. న్యాయవ్యవస్థ ప్రజల విమర్శలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. కొంతమంది న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషించేలా ఒత్తడి చేస్తున్నారని వారితోనే సమస్య ఉందని, భారత న్యాయవ్యవస్థ దీన్ని ఎప్పటికీ అంగీకరించదని రిజిజు అన్నారు.
ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ యొక్క అభిప్రాయం కొన్నిసార్లు భిన్నంగా ఉండవచ్చు, ఎందుకంటే ప్రతీఒక్కరు ఒకే విధమైన పరిశీలనను కలిగి ఉందలేరని ఆయన అన్నారు. పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో 65 అనవసర చట్టాలను రద్దు చేయాలని ప్రతిపాదించామని, ఇప్పటి వరకు 1,486 అనవసర చట్టాలను తొలగించామని చెప్పారు. భారతదేశాన్ని సురక్షితంగా మార్చాలని ప్రభుత్వ కోరుకుంటోందని, అందువల్ల కఠిన చట్టాలను రూపొందించాలని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!