Tamilnadu: నేడు సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ పై తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈ రోజు మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ మరియు తనని కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైక్టరేట్(ఈడీ) అభ్యర్థన అనే రెండు పిటిషన్లపై తీర్పును ఇవ్వనుంది. రవాణా శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మనీలాండరింగ్కు పాల్పడిన మంత్రి సెంథిల్ బాలాజీపై అక్రమ నగదు బదిలీ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి జూన్ 14 తెల్లవారుజాము వరకు సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ విభాగం దాదాపు 18 గంటల పాటు విచారించింది. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను ఒమందూరార్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
Read also: Al Pacino: ముసలోడే కానీ మామూలోడు కాదు.. 83ఏళ్ల వయసులో నాల్గొసారి తండ్రి అయ్యాడు
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశం ప్రకారం మంత్రిని గురువారం రాత్రి ఒమందూరార్ ఆసుపత్రి నుండి కావేరీ ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్స కోసం పంపించారు. సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ను మరియు అతనిని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అనుమతి కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి అల్లి గురువారం విచారించారు. అనంతరం సెంథిల్ బాలాజీని వీడియో ద్వారా కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ సెంథిల్ని ప్రశ్నిస్తూ 15 రోజుల కస్టడీకి సిద్ధమా? అర్ధరాత్రి ఏం జరిగింది? అని న్యాయమూర్తి అల్లి ప్రశ్నించారు.
Read also: Adipurush: థియేటర్ లో హనుమంతుడి సీటుపై వర్మ సంచలన వ్యాఖ్యలు..
మంత్రి సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ.. జుడీషియల్ కస్టడీకి వెళ్లడం కుదరదని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెన్నైకి రాగానే తనపై చర్యలు తీసుకుంటామని చెప్పారని.. అతను వచ్చిన రెండు రోజులకే ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరినంత వరకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నన్ను వేధించిందని మంత్రి చెప్పారు. తాను ఈడీ విచారణకు సహకరించానని చెప్పాడు. బాలాజీ సెంథిల్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో హాజరయ్యారు. సెంథిల్ బాలాజీకి వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును కోరారు. సెంథిల్ బాలాజీ దంపతుల బ్యాంకు ఖాతా, ఆదాయపు పన్ను ఖాతా వివరాలను ఎన్ఫోర్స్మెంట్ విభాగం విశ్లేషించి మొత్తం సమాచారాన్ని సేకరించింది. ఈ విషయాన్ని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ విధ్వంసానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని.. సెంథిల్ బాలాజీని శస్త్ర చికిత్స కోసం కావేరీ ఆసుపత్రిలో చేర్చేందుకు మద్రాసు హైకోర్టు అనుమతించినందున, అతని శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకుని, అతనిని ప్రశ్నించడానికి కస్టడీలో ఉంచకూడద మంత్రి తరపు లాయర్ వాదించారు.
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!