Presidential Poll: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు?.. వెంకయ్యతో అమిత్షా, నడ్డా కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు భాజపా అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కేంద్ర హోంమంత్రి అమిత్షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి కోసం ముమ్మర కసరత్తు చేస్తున్న తరుణంలో వెంకయ్యతో బీజేపీ పెద్దలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మోదీ-షా ద్వయం మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య పేరును ప్రకటించవచ్చనే ఊహాగానాలు దేశరాజధానిలో వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతిగా చేసిన వారు రాష్ట్రపతిగా పనిచేసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అదే సంప్రదాయాన్ని బీజేపీ కొనసాగిస్తే రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టవచ్చని రాజకీయ పండితులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం ప్రకటన వెలువడేవరకు వేచి ఉండాల్సిందే.. బీజేపీ పెద్దల మనసులో ఏముందో చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే బీజేపీ పెద్దల ఆశలు నెరవేరలేదు. కచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టాలనే ధృఢనిశ్చయంతో విపక్షాలు ఉన్నాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి నిలపనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసినట్లు సమాచారం.
Yashwant Sinha: టీఎంసీకి యశ్వంత్ సిన్హా రాజీనామా.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఆయనే!
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..