PM Modi: బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం హేమంత్ సర్కార్ బిజీగా ఉంది
- జార్ఖండ్లోని గర్వాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
- హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజం
- బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం బిజీగా ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ప్రధాని మోడీ గర్వాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై మోడీ నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం ఇండియా కూటమి బిజీగా ఉందని ఆరోపించారు. ‘‘గుష్పైథియా బంధన్ (చొరబాటుదారుల కూటమి)’’గా మారిందని పేర్కొన్నారు. చొరబాటుదారులతో సామాజిక నిర్మాణానికి ముప్పు అని చెప్పారు. పాఠశాలల్లో సరస్వతి వందనాన్ని అడ్డుకున్నారంటే.. రాష్ట్రంలో ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. బుజ్జగింపులే హేమంత్ సోరెన్ ప్రభుత్వ ప్రధాన అజెండా అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Nithiin: శివరాత్రికి తమ్ముడు దిగుతున్నాడు!
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
బంగ్లాదేశ్చొరబాటుదారులు జార్ఖండ్ వ్యాప్తంగా విస్తరిస్తున్నారన్నారు. వారి ఓట్లను పొందడానికి ప్రభుత్వం మద్దతుదారులుగా వ్యవహరిస్తోందని వివరించారు. సరస్వతీ వందనను(సరస్వతి గేయం) పాఠశాలలో ఆలపించేందుకు అనుమతించకపోడం ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోవాలన్నారు. పండుగల సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు, కర్ఫ్యూ విధించడం, దుర్గమ్మను ఆపడం అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు అన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల దుష్ట విధానాలు ఇలాగే కొనసాగితే జార్ఖండ్లో ఆదివాసీ సమాజం కుంచించుకుపోతుందని వివరించారు. చొరబాటు కూటమిని నిర్మూలించడానికి మీ ఓటును ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలను అమలు చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే జార్ఖండ్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మోడీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: World War 3 : జ్యోతిష్యం నిజమవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధమేనా..!?
జార్ఖండ్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఓటర్లు ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో వేచి చూడాలి.
#WATCH | Chaibasa | #JharkhandAssemblyElections2024 | PM Narendra Modi says, "Kolhan is again ready to uproot the JMM-Congress-RJD's tyrant govt. Everyone is saying that Kolhan is going to create a history… I am certain that BJP-NDA will form the govt with more number of seats… pic.twitter.com/WgRstaZPQE
— ANI (@ANI) November 4, 2024
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!