PM Modi: బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం హేమంత్ సర్కార్ బిజీగా ఉంది
- జార్ఖండ్లోని గర్వాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
- హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజం
- బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం బిజీగా ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ప్రధాని మోడీ గర్వాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై మోడీ నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం ఇండియా కూటమి బిజీగా ఉందని ఆరోపించారు. ‘‘గుష్పైథియా బంధన్ (చొరబాటుదారుల కూటమి)’’గా మారిందని పేర్కొన్నారు. చొరబాటుదారులతో సామాజిక నిర్మాణానికి ముప్పు అని చెప్పారు. పాఠశాలల్లో సరస్వతి వందనాన్ని అడ్డుకున్నారంటే.. రాష్ట్రంలో ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. బుజ్జగింపులే హేమంత్ సోరెన్ ప్రభుత్వ ప్రధాన అజెండా అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Nithiin: శివరాత్రికి తమ్ముడు దిగుతున్నాడు!
Also Read
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
బంగ్లాదేశ్చొరబాటుదారులు జార్ఖండ్ వ్యాప్తంగా విస్తరిస్తున్నారన్నారు. వారి ఓట్లను పొందడానికి ప్రభుత్వం మద్దతుదారులుగా వ్యవహరిస్తోందని వివరించారు. సరస్వతీ వందనను(సరస్వతి గేయం) పాఠశాలలో ఆలపించేందుకు అనుమతించకపోడం ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోవాలన్నారు. పండుగల సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు, కర్ఫ్యూ విధించడం, దుర్గమ్మను ఆపడం అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు అన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల దుష్ట విధానాలు ఇలాగే కొనసాగితే జార్ఖండ్లో ఆదివాసీ సమాజం కుంచించుకుపోతుందని వివరించారు. చొరబాటు కూటమిని నిర్మూలించడానికి మీ ఓటును ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలను అమలు చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే జార్ఖండ్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మోడీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: World War 3 : జ్యోతిష్యం నిజమవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధమేనా..!?
జార్ఖండ్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఓటర్లు ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో వేచి చూడాలి.
#WATCH | Chaibasa | #JharkhandAssemblyElections2024 | PM Narendra Modi says, "Kolhan is again ready to uproot the JMM-Congress-RJD's tyrant govt. Everyone is saying that Kolhan is going to create a history… I am certain that BJP-NDA will form the govt with more number of seats… pic.twitter.com/WgRstaZPQE
— ANI (@ANI) November 4, 2024
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!