Jharkhand Crisis:జార్ఖండ్లో హేమంత్ సోరెన్ విశ్వాస పరీక్ష నేడే
జార్ఖండ్ లో ఏం జరుగుతోంది? సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిలబడుతుందా? ఇవాళ ఏం జరగబోతోంది? ఇదే అంతటా ఉత్కంఠ రేపుతున్న అంశం. జార్ఖండ్లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఇవాళ బల పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధమయింది. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దటానికి గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బల పరీక్ష నిర్వహణకు యుపిఎ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బలపరీక్ష నేపధ్యంలో అధికార కూటమి ఎమ్మెల్యేలు ఛత్తీస్గడ్ నుంచి ఆదివారం రాంచీకి చేరుకున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బిజెపి కుట్రలు సాగిస్తోందన్న ఆందోళనతో గత కొన్ని రోజుల నుంచి ఛత్తీస్గఢ్లోని నవ రారుపూర్లో ఒక రిసార్ట్లో అధికార ఎమ్మెల్యేలు బస చేశారు.
Read Also: Astrology: సెప్టెంబర్5, సోమవారం దినఫలాలు
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఆదివారం అక్కడి నుంచి రాంచీలోని బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం బల పరీక్ష్షకు నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే రారుపూర్లో ఉన్న ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవడం విశేషం. జార్ఖండ్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నెల 1న మా ప్రతినిధి బృందం గవర్నర్ను కలుసుకున్న సమయంలో ఒకటి, రెండు రోజుల్లో పరిస్థితిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా.. ఇంతవరకూ ఏమీ జరగలేదు. కాబట్టి మేమే రాష్ట్ర అంసెబ్లీల్లో పరిస్థితిని ప్రస్తావిస్తాం.
మా మెజార్టీని నిరూపించుకుంటాం’ అని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలంగీర్ ఆలం మీడియాకు చెప్పారు. ఎమ్మెల్యేగా సోరెన్పై అనర్హత వేటు వేయడం నిలబడదని, దీనిని కోర్టు కొన్ని గంటల వ్యవధిలోనే కొట్టివేస్తుందని కూడా మంత్రి చెప్పారు. మరోవైపు సోమవారం జరిగే సమావేశాన్ని ప్రత్యేక సమావేశంగా పిలవడాన్ని స్పీకర్ రవీంద్రనాథ్ మహతో తిరస్కరించారు. ‘ఈ ఒక రోజు సమావేశం ప్రత్యేక సమావేశం కాదు. గత సెషన్ సమావేశాల్లో అసంపూర్తిగా మిగిపోయిన పనులు పూర్తి చేయడానికి సోమవారం సమావేశం నిర్వహిస్తున్నాం’ అని స్పీకర్ తెలిపారు. ఈ సమావేశంలో విశ్వాస పరీక్షను హేమంత్ సోరెన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి వుంది. ఈ నేపథ్యంలో మొత్తం దేశం అంతా జార్ఖండ్ వైపే చూస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!