Ravulapalem Firing: రావులపాలెంలో ఫైనాన్షియర్పై కాల్పుల కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యం ప్రశాంతంగా వుండే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉలిక్కిపడింది. రావులపాలెంలో కాల్పుల కలకలం రేగింది. ఫైనాన్షియర్ ఆదిత్యరెడ్డిపై కాల్పులు జరిపారు దుండగులు.. నాటు బాంబులు, గన్ తో దాడికి ప్రయత్నం చేయడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక అంతా టెన్షన్ పడ్డారు. అయితే, దుండగుల దాడితో అప్రమత్తం అయిన ఫైనాన్షియర్ ఆదిత్యరెడ్డి ప్రతిఘటించడంతో గన్ మిస్ ఫైర్ అయింది. ఆ ప్రాంతంలో జనాలు రావడంతో పారిపోయారు దుండగులు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
రావులపాలెంకు చెందిన ఫైనాన్సియర్ గుడిమెట్ల ఆదిత్య రెడ్డి పై గుర్తుతెలియని ఇద్దరు దుండగులు అర్థరాత్రి వేళ నాటు బాంబులు తుపాకీతో దాడికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారితో వాగ్వివాదానికి దిగిన ఫైనాన్షియర్ తిరగబడి ఎదురు తిరిగారు. దీనితో దుండగులు చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ అయి గాలిలో పేలింది. పెద్ద శపథంతో ఈ కాల్పులకు చుట్టుపక్కల వాళ్లు రావడంతో నాటుబాంబులు బ్యాగ్ అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు .
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన స్థలంలో దుండగులు వదిలి వెళ్ళిన బ్యాగులో సెల్ ఫోన్ జామర్ తో పాటు రెండు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది బాధితుడు ఫిర్యాదుపై ..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫైనాన్షియర్ గుడిమెట్ల ఆదిత్య రెడ్డిని హతమార్చడానికే దుండగులు పథకం ప్రకారం వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఫైనాన్షియర్ గుడిమెట్ల ఆదిత్య రెడ్డిని హత్య చేసి ఏ విధమైన ఆధారాలు లభించకుండా పరారు కావడానికి దుండగులు సెల్ ఫోన్ జామర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ఫైనాన్షియర్ కు దుండగులకు మధ్య ఆర్థిక లావాదేవీలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు . అయితే ఘటనకు సంబంధించి ఫైనాన్షియర్ గుట్టు విప్పకపోవడంతో మిస్టరీగా ఉంది..దుండగులు ఏవరో తెలియదని ఫైనాన్షియర్ చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కాల్పులపై స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?