Prashant Kishor: ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్డ్రా.. బీజేపీ ఒత్తిడితోనే జరిగిందన్న ప్రశాంత్ కిషోర్
- ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్డ్రా
- బీజేపీ ఒత్తిడితోనే జరిగిందన్న ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీపై జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ధ్వజమెత్తారు. బీజేపీ ఒత్తిడి కారణంగానే తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి వైదొలిగారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బెదిరించి నామినేషన్ల ఉపసంహరించుకునేలా చేశారని తెలిపారు. బీజేపీకి పోరాడటానికి ధైర్యం లేకపోవడంతో ఇలాంటి ఒత్తిడి వ్యూహాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం.. ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై మోడీ రిప్లై
Also Read
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
జన్ సురాజ్ పార్టీకి చెందిన దానాపూర్, బ్రహంపూర్, గోపాల్గంజ్ స్థానాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గోపాల్గంజ్ అభ్యర్థి శశి శేఖర్ సిన్హా అకస్మాత్తుగా మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. జన్ సురాజ్కు చెందిన ఇతర అభ్యర్థులు కూడా ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని… బీహార్లో ఓటమి భయంతో బీజేపీ ఎలా కుయుక్తులకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు
బీహార్లో ఎన్డీఏ కూటమి మినహా మిగతా అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. నిన్నామొన్నిటి దాకా కలిసి తిరిగిన ఇండియా కూటమి పార్టీలు.. చివరి నిమిషంలో ఎవరిదారి వారే చూసుకున్నారు. విభేదాలు కారణంగా వేర్వేరుగా పోటీ చేస్తున్నారు. విపక్ష కూటమి బలహీనతను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకుంటోంది.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇక ప్రధాని మోడీ అక్టోబర్ 24న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు ఉన్నారు. అలాగే రాజస్థాన్కు చెందిన ఇద్దరు నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..