Prashant kishor: 14 రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష విరమణ
- 14 రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష విరమణ
- బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా దీక్ష చేపట్టిన జన్ సూరాజ్ పార్టీ అధినేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గురువారం విరమించారు. జనవరి 2 నుంచి ఈ దీక్ష చేస్తున్నారు. బీహార్లోని మెరైన్ డ్రైవ్లోని సత్యాగ్రహ స్థలంలో నిరాహార దీక్షను విరమించారు. బీపీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవలను నిరసిస్తూ అభ్యర్థులకు మద్దతుగా నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎట్టకేలకు 14 రోజుల తర్వాత నిరాహార దీక్ష విరమించి.. విద్యార్థులకు అండగా ఉంటానని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Justin Trudeau: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాలకు ట్రూడో గుడ్ బై..
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
దీక్ష విరమణ అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. 14 రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినట్లు వెల్లడించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగినప్పుడు తాను గార్దానీబాగ్కు వెళ్లి తన గొంతు విప్పినట్లు చెప్పారు. అయినా ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా లాఠీఛార్జ్ చేసిందన్నారు. పలుమార్లు లాఠీఛార్జ్ చేయడం వల్లే నిరాహార దీక్షకు కూర్చోవల్సి వచ్చిందన్నారు.
ఇది కూడా చదవండి: Allahabad HC: భార్య “మద్యం” సేవించడం ఒక్కటే విడాకులకు కారణం కాదు..
విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన అధికారులపై రెండు రోజుల్లో హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. విద్యార్థులకు అనుకూలంగా తీర్పు రాకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేసిన అధికారులను వదిలిపెట్టమని చెప్పారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సత్యాగ్రహం చేస్తామన్నారు. రెండు రోజుల్లో రిట్ పిటిషన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. పోరాటంలో పాల్గొనేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇక బీహార్లోని రైతులు… హర్యానా, పంజాబ్ రైతుల తరహాలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరాహార దీక్షకు ముగింపు పలుకుతూ పవిత్ర గంగానదిలో కిషోర్ స్నానం చేశారు.
ఇది కూడా చదవండి: Brahmanandam: శేఖర్ కమ్ముల సినిమా రిజెక్ట్ చేసిన బ్రహ్మానందం కొడుకు !
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!