Congress: ఆజాద్కు షాక్.. కాంగ్రెస్లో చేరిన 17 మంది కాశ్మీర్ నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu ksahmir leaders rejoin Congress, quit Azad’s party: మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా పనిచేసిన ఆజాద్, డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ(డీఏపీ)ని ప్రారంభించారు. దీంతో కాశ్మీర్ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే తాజాగా ఆజాద్ కు షాక్ ఇస్తున్నారు నేతలు. మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఆజాద్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో ఆ పార్టీ అగ్రనాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆజాద్ పార్టీకి గుడ్ బై చెప్పారు జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్. మాజీ పీసీసీ చీఫ్ పీర్జాదా మహ్మద్ సయీద్ తో సహా మొత్తం 17 మంది నాయకులు శుక్రవారం తిరిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు నెలల తర్వాత మళ్లీ సొంతగూటికి చేరుకోవడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలు ఆనందం వ్యక్తం చేశారు. మరో రెండు వారాల్లో జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించే భారత్ జోడో యాత్రకు ముందు ఇలా నేతలు కాంగ్రెస్ చేరడం సంతోషకరమైన విషయం అని అన్నారు.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
Read Also: MP Asaduddin Owaisi: రూల్స్కి విరుద్ధం.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి రెండు చోట్ల ఓటు హక్కు..
భారత్ జోడో యాత్ర దేశంలో పెద్ద ఉద్యమంగా మారిందని.. అందుకే నేతలంగా మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ భావజాలం ఉన్న, అఖండ భారత్ కోరుకునే వారందరూ పార్టీలో చేరుతారని అన్నారు. తిరిగి వచ్చిన వారంతా రెండు నెలలు సెలవులపై వెళ్లినట్లు భావిస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ అన్నారు. మరోవైపు ఆజాద్ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కాశ్మీర్ లో జరిగే భారత్ జోడో యాత్రలో ఫరూక్ అబ్ధుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ శ్రీనగర్ లో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. భావోద్వేగం, స్నేహం కారణంగా కాంగ్రెస్ పార్టీని విడిచి ఆజాద్ పార్టీలో చేరానని కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్ అన్నారు. మా జీవితంలో 50 ఏళ్లు కాంగ్రెస్ లో గడిపామని.. డీఏపీ పార్టీలో సంతోషంగా లేమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!