Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య.. వలస కూలీ దారుణహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Migrant Labourer From Bihar Shot Dead By Terrorists: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. వలస కూలీ, హిందువులను, స్థానికేతరులను టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు ఇటీవల దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి ఇదే విధంగా వలస కూలీని కాల్చి చంపారు. బీహార్ మాదేపురాకు చెందిన వలస కూలీ మహ్మద్ అమ్రేజ్ ను టెర్రరిస్టులు కాల్చిచంపారు. ఈ ఘటన బందిపోరా జిల్లాలోని సోద్నారా సుంబల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి తర్వాత టెర్రిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ సమయంలో మహ్మద్ అమ్రేజ్ పై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో బాధితుడు మరణించాడు.
Read Also: Karnataka: ఇరు వర్గాల మధ్య చిచ్చురాజేసిన ప్రేమ వ్యవహారం.. ఇద్దరు మృతి
Also Read
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
అంతకు ముందు రోజు రాజౌరి జిల్లాలో ఆర్మీ క్యాంపుపై దాడి చేయడానికి ప్రయత్నించారు టెర్రరిస్టులు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. 2016 ఉరీ తరహా ఘటన చేసేందుకు మరోసారి టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. అయితే భద్రతా బలగాల ఎదురుదాడిలో టెర్రరిస్టులు చనిపోయారు. స్వాతంత్య్ర వేడుకలకు ముందు దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం బుద్గామ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. గతంలో హిందూ పండిట్ రాహుల్ భట్ , కాశ్మీర్ టీవీ యాక్టర్ అమ్రీన్ భట్ ను కాల్చి చంపారు దుండగులు. ఈ హత్యలతో ప్రమేయం ఉన్న కీలక ఉగ్రవాదిని బుద్గామ్ ఎన్ కౌంటర్ లో హతమర్చాయి.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. సులువుగా లక్ష్యం అయ్యే వలస కూలీలు, హిందువులను టార్గెట్ చేస్తూ చంపుతున్నారు. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద గ్రూప్ తో పాటు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్లలో తొలగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!