Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్య.. వలస కూలీ దారుణహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Migrant Labourer From Bihar Shot Dead By Terrorists: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. వలస కూలీ, హిందువులను, స్థానికేతరులను టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు ఇటీవల దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి ఇదే విధంగా వలస కూలీని కాల్చి చంపారు. బీహార్ మాదేపురాకు చెందిన వలస కూలీ మహ్మద్ అమ్రేజ్ ను టెర్రరిస్టులు కాల్చిచంపారు. ఈ ఘటన బందిపోరా జిల్లాలోని సోద్నారా సుంబల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి తర్వాత టెర్రిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఈ సమయంలో మహ్మద్ అమ్రేజ్ పై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో బాధితుడు మరణించాడు.
Read Also: Karnataka: ఇరు వర్గాల మధ్య చిచ్చురాజేసిన ప్రేమ వ్యవహారం.. ఇద్దరు మృతి
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
అంతకు ముందు రోజు రాజౌరి జిల్లాలో ఆర్మీ క్యాంపుపై దాడి చేయడానికి ప్రయత్నించారు టెర్రరిస్టులు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. 2016 ఉరీ తరహా ఘటన చేసేందుకు మరోసారి టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. అయితే భద్రతా బలగాల ఎదురుదాడిలో టెర్రరిస్టులు చనిపోయారు. స్వాతంత్య్ర వేడుకలకు ముందు దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం బుద్గామ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. గతంలో హిందూ పండిట్ రాహుల్ భట్ , కాశ్మీర్ టీవీ యాక్టర్ అమ్రీన్ భట్ ను కాల్చి చంపారు దుండగులు. ఈ హత్యలతో ప్రమేయం ఉన్న కీలక ఉగ్రవాదిని బుద్గామ్ ఎన్ కౌంటర్ లో హతమర్చాయి.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. సులువుగా లక్ష్యం అయ్యే వలస కూలీలు, హిందువులను టార్గెట్ చేస్తూ చంపుతున్నారు. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద గ్రూప్ తో పాటు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్లలో తొలగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..