Jagdeep Dhankhar: రైతు కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతి దాకా.. జగ్దీప్ ధన్కర్ ప్రస్థానమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagdeep Dhankhar elected India’s new Vice President: సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జగ్దీప్ ధన్కర్ అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఉప రాష్ట్రపతి పదవిని పొందారు. తాజాగా ఉప రాస్ట్రపతి ఎన్నికల్లో జగ్దీప్ ధన్కర్ భారీ విజయం సాధించారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జగ్దీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాను ఓడించారు. ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన జగ్దీప్ ధన్కర్ ఆగస్టు 11న భారత 14వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
71 ఏళ్ల జగ్దీప్ ధన్కర్ రాజస్థాన్ లోని కితానా గ్రామంలో మూ 18, 1951లో గోకల్ చంద్, కేసరి దేవి దంపతుకు జన్మించారు. సాధారణ జాట్ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను కితానా గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తరువాత చితోర్ ఘర్ సైనిక్ స్కూల్ లో విద్యను అభ్యసించారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలో పట్టా తీసుకున్నారు. జగ్దీప్ ధన్కర్, సుదేశ్ ధన్కర్ ని వివాహం చేసుకున్నారు. సుప్రీం కోర్టుతో పాటు రాజస్థాన్ హైకోర్టులో అడ్వొకేట్ గా పనిచేశారు.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
Read Also: Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిగా జగ్ దీప్ ధన్కర్ ఘన విజయం
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని మాజీ ఉప ప్రధాన మంత్రి చౌదరీ దేవీలాల్ వ్యూహాత్మకంగా జగ్దీప్ ధన్కర్ ని జున్ జున్ నియోజకవర్గం నుంచి జనతాదల్ బరిలోకి దించారు. రాజస్థాన్ లోని జాట్ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. 1990లో చంద్రశేఖర్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 1991లో పీవీ నరసింహ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1993లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో అశోక్ గెహ్లాట్ ప్రాబల్యం పెరుగుతుండటంతో 2003లో బీజేపీలో చేరారు. అయితే ఆ సమయంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, జగ్దీప్ ధన్కర్ కు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తరువాత మోదీ ప్రభుత్వం 2019 నుంచి బెంగాల్ గవర్నర్ గా నియమించింది. అంతకుముందు జగ్దీప్ ధన్కర్ రాజస్థాన్ హైకోర్టు న్యాయవాది, బార్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. జగ్దీప్ ధన్కర్ ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!