USA: అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం, స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం
- పాక్ ఆర్మీ చీఫ్ని మిలిటరీ పెరేడ్కి ఆహ్వానించిన అమెరికా..
- భారత్ మిత్రదేశం అంటూనే పాకిస్తాన్కి ప్రాధాన్యత..
- అమెరికా నైజమే వాడుకొని వదిలేయడమంటున్న విశ్లేషకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికా ఎప్పుడూ కూడా నమ్మకమైన మిత్రదేశంగా ఉండదనేది మరోసారి బహిర్గతమైంది. అమెరికా మాజీ అగ్రశ్రేణి దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. “అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం కావచ్చు, కానీ అమెరికాకు స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం.” అని అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం అమెరికాకు చక్కగా సరిపోతాయి. భారత్తో ఒక వైపు వ్యూహాత్మక సంబంధాలు కావాలంటూనే, మరోవైపు పాకిస్తాన్కి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇటీవల ఫీల్డ్ మార్షల్గా పదొన్నతి పొందిన ఆసిమ్ మునీర్ని అమెరికా ఆహ్వానించింది. ఈ వారం వాషింగ్టన్లో జరిగే అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలకు ఆసిమ్ మునీర్ వెళ్తున్నారు. అమెరికా ఆహ్వానం మేరకు శనివారం వాషింగ్టన్ లో జరిగే ఈ మిలిటరీ పెరేడ్కి మునీర్ హాజరుకానున్నారు. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ వంటి దేశానికి అమెరికా మద్దతు ఇవ్వడం, భారత్-పాకిస్తాన్ని ఒకే తీరుగా చూస్తోంది.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
Read Also: Bird Hit: పక్షి ఢీకొనడం వల్లే ఎయిరిండియా ప్రమాదం జరిగిందా..? నిపుణుల విశ్లేషణ..
నిజానికి అమెరికాతో స్నేహం అంటేనే కత్తి మీద సాము లాంటిది. నమ్ముకున్న వారిని తన ప్రయోజనాల కోసం నట్టేట ముంచడం దాని నైజం. తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఎవరిని ఎప్పుడైనా వాడుకుంటుంది, వదిలేసుకుంటుంది. నిజానికి, చైనాకు అడ్డుకట్ట వేసేందుకు ఇండో-పసిఫిక్ రీజియన్లో తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్-జపాన్-యూఎస్-ఆస్ట్రేలియాతో ‘‘క్వాడ్ కూటమి’’ ఏర్పాటు చేసింది. తన విషయానికి వస్తే మిత్రదేశాలు సాయం చేయాలని చెబుతుంది, కానీ మిత్రదేశాల విషయాలను తన విషయాలుగా ఏనాడు అమెరికా పట్టించుకోదు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఐఎంఎఫ్ లోన్ వచ్చేలా చేయడంలో యూఎస్ మద్దతు ఇచ్చింది.
ఇదిలా ఉంటే, అమెరికా టాప్ మిలిటరీ జనరల్ నరల్ మైఖేల్ కురిల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ‘‘ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు’’ ఈ ప్రాంతంలో అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుందని ప్రశంసించారు. పాకిస్తాన్ ను ‘‘అద్భుత భాగస్వామి’’ అని కొనియాడారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికాకు పాకిస్తాన్ సహకరిస్తోందని చెప్పాడు. అయితే, భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటాన్ని మాత్రం భారత సొంత విషయంగా భావిస్తోంది. ఇది అమెరికా ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తోంది.
తాజావార్తలు
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!