USA: అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం, స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం
- పాక్ ఆర్మీ చీఫ్ని మిలిటరీ పెరేడ్కి ఆహ్వానించిన అమెరికా..
- భారత్ మిత్రదేశం అంటూనే పాకిస్తాన్కి ప్రాధాన్యత..
- అమెరికా నైజమే వాడుకొని వదిలేయడమంటున్న విశ్లేషకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికా ఎప్పుడూ కూడా నమ్మకమైన మిత్రదేశంగా ఉండదనేది మరోసారి బహిర్గతమైంది. అమెరికా మాజీ అగ్రశ్రేణి దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ.. “అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం కావచ్చు, కానీ అమెరికాకు స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం.” అని అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం అమెరికాకు చక్కగా సరిపోతాయి. భారత్తో ఒక వైపు వ్యూహాత్మక సంబంధాలు కావాలంటూనే, మరోవైపు పాకిస్తాన్కి ఎక్కడా లేని ప్రాధాన్యత ఇస్తోంది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇటీవల ఫీల్డ్ మార్షల్గా పదొన్నతి పొందిన ఆసిమ్ మునీర్ని అమెరికా ఆహ్వానించింది. ఈ వారం వాషింగ్టన్లో జరిగే అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలకు ఆసిమ్ మునీర్ వెళ్తున్నారు. అమెరికా ఆహ్వానం మేరకు శనివారం వాషింగ్టన్ లో జరిగే ఈ మిలిటరీ పెరేడ్కి మునీర్ హాజరుకానున్నారు. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ వంటి దేశానికి అమెరికా మద్దతు ఇవ్వడం, భారత్-పాకిస్తాన్ని ఒకే తీరుగా చూస్తోంది.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
Read Also: Bird Hit: పక్షి ఢీకొనడం వల్లే ఎయిరిండియా ప్రమాదం జరిగిందా..? నిపుణుల విశ్లేషణ..
నిజానికి అమెరికాతో స్నేహం అంటేనే కత్తి మీద సాము లాంటిది. నమ్ముకున్న వారిని తన ప్రయోజనాల కోసం నట్టేట ముంచడం దాని నైజం. తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఎవరిని ఎప్పుడైనా వాడుకుంటుంది, వదిలేసుకుంటుంది. నిజానికి, చైనాకు అడ్డుకట్ట వేసేందుకు ఇండో-పసిఫిక్ రీజియన్లో తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్-జపాన్-యూఎస్-ఆస్ట్రేలియాతో ‘‘క్వాడ్ కూటమి’’ ఏర్పాటు చేసింది. తన విషయానికి వస్తే మిత్రదేశాలు సాయం చేయాలని చెబుతుంది, కానీ మిత్రదేశాల విషయాలను తన విషయాలుగా ఏనాడు అమెరికా పట్టించుకోదు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఐఎంఎఫ్ లోన్ వచ్చేలా చేయడంలో యూఎస్ మద్దతు ఇచ్చింది.
ఇదిలా ఉంటే, అమెరికా టాప్ మిలిటరీ జనరల్ నరల్ మైఖేల్ కురిల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ‘‘ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు’’ ఈ ప్రాంతంలో అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుందని ప్రశంసించారు. పాకిస్తాన్ ను ‘‘అద్భుత భాగస్వామి’’ అని కొనియాడారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికాకు పాకిస్తాన్ సహకరిస్తోందని చెప్పాడు. అయితే, భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటాన్ని మాత్రం భారత సొంత విషయంగా భావిస్తోంది. ఇది అమెరికా ద్వంద్వ స్వభావాన్ని చూపిస్తోంది.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!