Gujarat: ఉద్రిక్తతలకు దారితీసిన.. దర్గాకు నోటీసుల జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్లోని జునాగఢ్లో ఉన్న ఒక దర్గాకు మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. దర్గాను అక్రమంగా నిర్మించారని అందుకే కూల్చివేతకు నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్న మున్సిపల్ అధికారులు.. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దర్గా నిర్వహకులకు సూచించారు. దర్గా కూల్చివేతకు నోటీసులు ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులతోపాటు దర్గా దగ్గరకు రావడంతో దర్గాను కూల్చివేయడానికి వచ్చారని భావించిన ఒక వర్గానికి చెందిన ప్రజలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఎర్పడ్డాయి.
Read also: Donald Trump: ట్రంప్ మామ ఏంటి ఇది? ఇష్టమొచ్చినంత తినమన్నాడు.. బిల్లు టైంకు జారుకున్నాడు..!
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో నిర్మించిన దర్గా అక్రమంగా నిర్మించారని అందుకే కూల్చివేత నోటీసును ఇస్తున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం దర్గా నిర్వహాకులకు తెలిపింది. అందుకు సంబంధించిన నోటీసులను దర్గా వెలుపల అంటించడానికి అధికారులు వచ్చారు. పోలీసులతో పాటు మున్సిపల్ శాఖ అదికారులు రావడంతో దర్గా కూల్చివేతకు వచ్చరని భావించిన ఒక వర్గానికి చెందిన వ్యక్తులు సుమారు 200-300 మంది ప్రజలు దర్గా చుట్టూ గుమిగూడారు. దర్గా వెలుపల కూల్చివేత నోటీసును ఉంచడానికి జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మజేవాడి గేట్ ముందు చేరుకున్నారు. మతపరమైన నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించారని నోటీసులో పేర్కొంది.
Read also: MP Mopidevi Venkataramana: వైసీపీ ఎంపీకి నిరసన సెగ..
దర్గాను చట్టబద్ధంగా నిర్మించారా? లేదా? అనేది స్పష్టం చేయాలని అధికారులు దర్గా నిర్వహకులను ప్రశ్నించింది. అనుమతి లేకుండా నిర్మిస్తే లేకుంటే కూల్చివేస్తామని.. అందుకు అయ్యే ఖర్చును నిర్వాహకులు భరించాలని పేర్కొన్నారు. నోటీసులకు సంబంధించి ఐదు రోజులలోగా ఆధారాలు సమర్పించాలని అధికారులు గడువు ఇచ్చారు. ఈ నోటీసు కలకలం సృష్టించింది. దర్గా కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న ప్రజలు కేకలు వేయడం, పోలీసు వాహానాలపై, పోలీసు అధికారులపై రాళ్లు రువ్వారు. పోలీసు పోస్ట్ను ధ్వంసం చేశారు మరియు పోలీసు వాహనాలకు కూడా నిప్పు పెట్టారు.హింస చెలరేగడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఈ దాడిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో సహా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!