Gujarat: ఉద్రిక్తతలకు దారితీసిన.. దర్గాకు నోటీసుల జారీ
Gujarat: గుజరాత్లోని జునాగఢ్లో ఉన్న ఒక దర్గాకు మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. దర్గాను అక్రమంగా నిర్మించారని అందుకే కూల్చివేతకు నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్న మున్సిపల్ అధికారులు.. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దర్గా నిర్వహకులకు సూచించారు. దర్గా కూల్చివేతకు నోటీసులు ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులతోపాటు దర్గా దగ్గరకు రావడంతో దర్గాను కూల్చివేయడానికి వచ్చారని భావించిన ఒక వర్గానికి చెందిన ప్రజలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఎర్పడ్డాయి.
Read also: Donald Trump: ట్రంప్ మామ ఏంటి ఇది? ఇష్టమొచ్చినంత తినమన్నాడు.. బిల్లు టైంకు జారుకున్నాడు..!
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో నిర్మించిన దర్గా అక్రమంగా నిర్మించారని అందుకే కూల్చివేత నోటీసును ఇస్తున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం దర్గా నిర్వహాకులకు తెలిపింది. అందుకు సంబంధించిన నోటీసులను దర్గా వెలుపల అంటించడానికి అధికారులు వచ్చారు. పోలీసులతో పాటు మున్సిపల్ శాఖ అదికారులు రావడంతో దర్గా కూల్చివేతకు వచ్చరని భావించిన ఒక వర్గానికి చెందిన వ్యక్తులు సుమారు 200-300 మంది ప్రజలు దర్గా చుట్టూ గుమిగూడారు. దర్గా వెలుపల కూల్చివేత నోటీసును ఉంచడానికి జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మజేవాడి గేట్ ముందు చేరుకున్నారు. మతపరమైన నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించారని నోటీసులో పేర్కొంది.
Read also: MP Mopidevi Venkataramana: వైసీపీ ఎంపీకి నిరసన సెగ..
దర్గాను చట్టబద్ధంగా నిర్మించారా? లేదా? అనేది స్పష్టం చేయాలని అధికారులు దర్గా నిర్వహకులను ప్రశ్నించింది. అనుమతి లేకుండా నిర్మిస్తే లేకుంటే కూల్చివేస్తామని.. అందుకు అయ్యే ఖర్చును నిర్వాహకులు భరించాలని పేర్కొన్నారు. నోటీసులకు సంబంధించి ఐదు రోజులలోగా ఆధారాలు సమర్పించాలని అధికారులు గడువు ఇచ్చారు. ఈ నోటీసు కలకలం సృష్టించింది. దర్గా కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న ప్రజలు కేకలు వేయడం, పోలీసు వాహానాలపై, పోలీసు అధికారులపై రాళ్లు రువ్వారు. పోలీసు పోస్ట్ను ధ్వంసం చేశారు మరియు పోలీసు వాహనాలకు కూడా నిప్పు పెట్టారు.హింస చెలరేగడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఈ దాడిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో సహా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!