Gurugram: హాట్ కేకుల్లా లగ్జరీ హోమ్స్.. 3 రోజుల్లోనే 868 మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు విక్రయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurugram: ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఢిల్లీ సమీపంలో 865 మిలియన్ డాలర్లతో చేపడుతున్న లగ్జరీ హోమ్స్ నిర్మాణం ప్రారంభం కాకముందే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ ప్రాంతంలో 1,113 విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్టులోని ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో ఫోర్-బెడ్రూనం నివాసాలు, పెంట్ హౌజ్ యూనిట్లు అమ్ముడైనట్లు డెవలపర్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపారు. ఇందులో ఒకవంతు ఎన్ఆర్ఐలు కొనుగోలు చేశారు.
గూగుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్తో సహా అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు, ఐటీ ఇండస్ట్రీకి కేంద్రంగా ఉన్న శాటిలైట్ సిటిలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్స్ విస్తరించి ఉన్నాయి. ఇత డీఎల్ఎఫ్ షేర్స్ గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. 2008తో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి బెంచ్ మార్క్. BSE సెన్సెక్స్ ఇండెక్స్లో 18% పెరుగుదలను అధిగమించింది.
Also Read
- Mukesh Ambani: వాటర్, కోలా తర్వాత ఐస్క్రీమ్.. రూ.10తో ఐస్క్రీమ్ మార్కెట్లోకి అంబానీ ఎంట్రీ
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
Read Also: Flipkart: వందల మంది ఉద్యోగులపై ఫ్లిప్ కార్ట్ వేటు.. అదే అసలు కారణమా?
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు కీలక స్థానంలో ఉంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రజల ఆదాయస్థాయిలు పెరిగాయి. దీంతో డబ్బున్న భారతీయులు మరింత లగ్జరీగా ఉండేందుకు కార్ల నుంచి అపార్ట్మెంట్ల దాకా అన్ని ఖరీదుగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రీమియం అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిన కారణంగా రానున్న కాలంలో పలువురు బిల్డర్లు ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ లగ్జరీ బూమ్ మరో రెండేళ్లు కొనసాగుతుందని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అండ్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు.
ధనవంతులే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ప్రాజెక్టులను కొనుగోలు చేస్తున్నారు. గతేడాది డీఎల్ఎఫ్ ఇదే విధంగా కేవలం మూడు రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఇలాగే 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన విలాసవంతమైన హోమ్స్ని విక్రయించింది.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!