Gurugram: హాట్ కేకుల్లా లగ్జరీ హోమ్స్.. 3 రోజుల్లోనే 868 మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు విక్రయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurugram: ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఢిల్లీ సమీపంలో 865 మిలియన్ డాలర్లతో చేపడుతున్న లగ్జరీ హోమ్స్ నిర్మాణం ప్రారంభం కాకముందే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ ప్రాంతంలో 1,113 విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్టులోని ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో ఫోర్-బెడ్రూనం నివాసాలు, పెంట్ హౌజ్ యూనిట్లు అమ్ముడైనట్లు డెవలపర్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపారు. ఇందులో ఒకవంతు ఎన్ఆర్ఐలు కొనుగోలు చేశారు.
గూగుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్తో సహా అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు, ఐటీ ఇండస్ట్రీకి కేంద్రంగా ఉన్న శాటిలైట్ సిటిలో 116 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్స్ విస్తరించి ఉన్నాయి. ఇత డీఎల్ఎఫ్ షేర్స్ గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. 2008తో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి బెంచ్ మార్క్. BSE సెన్సెక్స్ ఇండెక్స్లో 18% పెరుగుదలను అధిగమించింది.
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
Read Also: Flipkart: వందల మంది ఉద్యోగులపై ఫ్లిప్ కార్ట్ వేటు.. అదే అసలు కారణమా?
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు కీలక స్థానంలో ఉంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రజల ఆదాయస్థాయిలు పెరిగాయి. దీంతో డబ్బున్న భారతీయులు మరింత లగ్జరీగా ఉండేందుకు కార్ల నుంచి అపార్ట్మెంట్ల దాకా అన్ని ఖరీదుగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రీమియం అపార్ట్మెంట్లకు డిమాండ్ ఏర్పడిన కారణంగా రానున్న కాలంలో పలువురు బిల్డర్లు ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ వంటి కీలక నగరాల్లో ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఈ లగ్జరీ బూమ్ మరో రెండేళ్లు కొనసాగుతుందని రియల్ ఎస్టేట్ బ్రోకర్ అండ్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు.
ధనవంతులే కాదు, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ప్రాజెక్టులను కొనుగోలు చేస్తున్నారు. గతేడాది డీఎల్ఎఫ్ ఇదే విధంగా కేవలం మూడు రోజుల్లోనే 1 బిలియన్ డాలర్ల విలువైన 1,100 అపార్ట్మెంట్లను విక్రయించింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కూడా ఇలాగే 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన విలాసవంతమైన హోమ్స్ని విక్రయించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!