ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది.. జీవితంలో ఒక్కసారే చేసుకొనే పెళ్లిని ఘనంగా చేసుకోవాలని ఎన్నెన్నో కలలు కంటారు.. అయితే కొందరికి మాత్రం ఆ గడియలు వచ్చేసరికి పెళ్లి జరగదు.. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. పెళ్లిళ్లను ఖాయం చేసే వినాయక స్వామి ఒకరు ఉన్నారు.. ఆ గుడికి వెళితే అందరికీ పెళ్లిళ్లు జరుగుతాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ గుడి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. ఈ ప్రత్యేక ఆలయం ఉత్తర కర్ణాటకలో ఉంది.. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని పండితులు సైతం చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని పది లక్షల మంది దర్శించుకుంటారట. సాధారణంగా వినాయకుడు ఏ గుడిలో అయినా నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. అయితే ఈ ఆలయంలో మాత్రం వినాయకుడు రెండు చేతులతో దర్శనమిస్తాడు.. నిలుచుకున్న ఆకారంలో కనిపిస్తాడు.. అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు ఉందని సమాచారం.. ఈ గుడిని 1500 ఏళ్ల క్రితం నిర్మించారని చరిత్ర చెబుతుంది..
పెళ్లి సంబంధం కుదిరిన వెంటనే ఇక్కడ వినాయక స్వామి చెంత రెండు చీటీలను ఉంచుతారు. కుడి పాదం దగ్గర ఉన్న చీటీ కింద పడితే దేవుని అంగీకారం ఉందని ఎడమ పాదం దగ్గర ఉన్న చీటీ కింద పడితే దేవుని అంగీకారం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.. దేవుని అనుగ్రహం లేదని భావించిన వాళ్లు మరో సంబంధం వెతుక్కుంటారని సమాచారం… ప్రత్యేకమైన ప్రసాదాన్ని కూడా ఇస్తారు.. ఇక ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల ద్వారా సులువుగా చేరుకోవచ్చు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంను జీవితంలో ఒక్కసారైనా సందర్శిస్తే మంచి జరుగుతుంని పండితులు చెబుతున్నారు..