Pakistan: టర్కీ, అజర్ బైజాన్ పర్యటనకు పాక్ ప్రధాని షహబాజ్.. కారణం ఇదేనా..
- టర్కీ, అజర్ బైజాన్కి పాక్ ప్రధాని పర్యటన..
- భారత్కి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా టూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత్ చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మిత్రదేశాల పర్యటనకు వెళ్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్, పీఓకేలోని 09 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ తర్వాత పాక్ సైన్యం, భారత్పై దాడి చేయడానికి యత్నించింది. దీనికి బదులుగా పాక్ లోని 11 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసి గట్టి బుద్ధి చెప్పింది.
Read Also: Mysuru Suicide: ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
ఈ పరిణామాల తర్వాత భారత్, పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదంపై దౌత్య బృందాలను పలు దేశాలకు పంపించింది. దీనిపై పాకిస్తాన్లో ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. తాము ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నామని భారత్ ప్రపంచదేశాల ముందు బయటపెడుతుందని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇటీవల తమకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన టర్కీ, అజర్ బైజాన్ పర్యటనకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్తున్నారు. వీటితో పాటు తజకిస్తాన్, ఇరాన్లో కూడా పర్యటించనున్నారు. మే 25-30 వరకు ఈ పర్యటన సాగుతోంది.
పాక్ తీరును భారత్ బహిరంగంగా ఎండగడుతుండటంతో టర్కీ, అజర్ బైజాన్ మద్దతును మరింతగా కూడగట్టేందుకు ఆయా దేశాల్లో షరీఫ్ పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ తన డ్రోన్లను ఇచ్చింది. ఈ డ్రోన్ల ద్వారా పాక్ భారత్పై దాడి చేసింది. ఇదే కాకుండా ఇద్దరు టర్కిష్ డ్రోన్ ఆపరేటర్లను కూడా పాకిస్తాన్లో ఉంచింది. భారత ప్రతిదాడుల్లో టర్కీ డ్రోన్లతో పాటు ఇద్దరు టర్కిష్ వ్యక్తులు కూడా మరణించారు. అజర్బైజాన్ కూడా పాకిస్తాన్కు అండగా నిలిచింది. ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దాడులను ఖండిస్తూ, పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావం తెలిపింది.
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!