ఎన్నికలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వ తేదీ వరకు ఎన్నికలు జగరబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్ను ఈరోజు సీఈసీ ప్రకటించింది. జనవరి 14 వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ను రిలీజ్ చేయబోతున్నారు. షెడ్యూల్ను విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 14 వరకు ఎలాంటి పాదయాత్రలు, ర్యాలీలు చేసేందుకు వీలు లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. అదే విధంగా ఎన్నికల ప్రచారాన్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిషేధం విధించింది. అయితే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. విజయోత్సవ ర్యాలీలను రద్దు చేసింది. గెలిచిన అభ్యర్థి వెంట ఇద్దరు మాత్రమే ఉండాలని అదేశించింది. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది.
Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: 7 దశల్లో పోలింగ్… మార్చి 10న కౌంటింగ్..
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
అయితే, ఇండియాలో ఇప్పటికే థర్డ్వేవ్ మొదలైంది. థర్డ్ వేవ్ ప్రారంభంలోనే రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య థర్డ్ వేవ్ పీక్స్లో ఉంటుందని ఐఐటి మద్రాస్ నిపుణుల సర్వేలో తేలింది. న్యూఇయర్ వేడుకలను అనుమతులు ఇవ్వడంతోనే కేసులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక అభ్యర్థులు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేకుండా ఉండదు. ఎన్నికల కారణంగా దేశంలో కరోనా కేసులు మరింతగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నాయి. ఎన్నికలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్ వ్యాల్యూ ఇప్పటికే దేశంలో 4 గా ఉన్నది. ఇది మరింత పెరిగితే డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!