Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవానికి ఇక్బాల్ అన్సారీకి ఆహ్వానం.. ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధువులతో సహా 7000 మంది అతిథులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇదిలా ఉంటే రామజన్మభూమి-బాబ్రీ మసీదులో వివాదంలో మాజీ న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీని జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని అందించింది.
Read Also: Halal Certificate: సుప్రీంకోర్టుకు చేరిన హలాల్ సర్టిఫికెట్ వివాదం.. యూపీ సర్కార్ కు నోటీసులు
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇక్బాల్ అన్సారీ బాబ్రీ మసీదుకు మద్దతుగా వాదనలు వినిపించారు. అంతకుముందు ఆగస్టు 5, 2020న జరిగిన రామమందిరపు ‘భూమిపూజ’ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం కూడా అందింది. డిసెంబర్ 30న అయోధ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలికిన వందలాది మందిలో ఇక్బాల్ అన్సారీ కూడా ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్, విమానాశ్రయాల ప్రారంభానికి వెళ్లిన సందర్భంలో అన్సారీ ప్రధాని కాన్వాయ్పై పూల వర్షాన్ని కురిపించారు. ప్రధాని నరేంద్రమోడీ మా ప్రాంతానికి వచ్చారు. ఆయన మా అతిధి, మన ప్రధాన మంత్రి అన్ని ఆ సమయంలో అన్సారీ అన్నారు.
నవంబర్ 9, 2019 న, అయోధ్య వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, చారిత్రాత్మక తీర్పును చెప్పింది. అదే సమయంలో అయోధ్యలోనే వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తిగా సాంప్రదాయ నాగర శైలిలో రామమందిరాన్ని నిర్మించారు. మందరిం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!