Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవానికి ఇక్బాల్ అన్సారీకి ఆహ్వానం.. ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధువులతో సహా 7000 మంది అతిథులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇదిలా ఉంటే రామజన్మభూమి-బాబ్రీ మసీదులో వివాదంలో మాజీ న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీని జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని అందించింది.
Read Also: Halal Certificate: సుప్రీంకోర్టుకు చేరిన హలాల్ సర్టిఫికెట్ వివాదం.. యూపీ సర్కార్ కు నోటీసులు
Also Read
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ఇక్బాల్ అన్సారీ బాబ్రీ మసీదుకు మద్దతుగా వాదనలు వినిపించారు. అంతకుముందు ఆగస్టు 5, 2020న జరిగిన రామమందిరపు ‘భూమిపూజ’ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం కూడా అందింది. డిసెంబర్ 30న అయోధ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలికిన వందలాది మందిలో ఇక్బాల్ అన్సారీ కూడా ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు అయోధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్, విమానాశ్రయాల ప్రారంభానికి వెళ్లిన సందర్భంలో అన్సారీ ప్రధాని కాన్వాయ్పై పూల వర్షాన్ని కురిపించారు. ప్రధాని నరేంద్రమోడీ మా ప్రాంతానికి వచ్చారు. ఆయన మా అతిధి, మన ప్రధాన మంత్రి అన్ని ఆ సమయంలో అన్సారీ అన్నారు.
నవంబర్ 9, 2019 న, అయోధ్య వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, చారిత్రాత్మక తీర్పును చెప్పింది. అదే సమయంలో అయోధ్యలోనే వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తిగా సాంప్రదాయ నాగర శైలిలో రామమందిరాన్ని నిర్మించారు. మందరిం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!