Ahmedabad Plane Crash: టేకాఫ్ ముందు ఇంధన స్విచ్లు బాగానే ఉన్నాయి.. అంతలోనే ఎలా ఆగాయి? దీనిపైనే ప్రత్యేక ఫోకస్..!
- టేకాఫ్ ముందు ఇంధన స్విచ్లు బాగానే ఉన్నాయి
- అంతలోనే ఎలా ఆగాయి?
- అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు బృందం ప్రత్యేక ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చాక లేనిపోని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అటు బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆవేదన.. ఇటు ప్రయాణికుల్లోనూ సరికొత్త భయాందోళనలు నెలకొన్నాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానం.. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు బాగానే వచ్చింది. అప్పుడు ఎలాంటి సమస్య కనపించలేదు. కానీ అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు టేకాఫ్ అయినప్పుడు మాత్రం ఇంధన స్విచ్లు రెండు ఆగిపోయాయి. అంతేకాకుండా విద్యుత్ సరఫరా కూడా వెంటనే నిలిచిపోయింది. సాఫ్ట్వేర్ కూడా పని చేయలేదు. దీంతో విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. అయితే విమానంలో ఇంధన స్విచ్లు బాగానే ఉన్నట్లుగా తేలింది. కానీ టేకాఫ్ అయిన తర్వాత ఫ్యూయల్ స్విచ్లు ఎందుకు ఆగిపోయాయన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం దీనిపైనే దర్యాప్తు బృందం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ మేరకు వర్గాలు పేర్కొన్నాయి.
ఇది కూాడా చదవండి: Shubhanshu Shukla: 18 రోజులు అంతరిక్షంలో గడిపి తిరిగొచ్చిన వేళ.. భార్యాబిడ్డలను గుండెలకు హత్తుకుని భావోద్వేగం..
Also Read
- Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ప్రాథమిక నివేదికలో టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే అకస్మాత్తుగా ఇంధన సరఫరా నిలిచిపోయింది. అయితే విద్యుత్ వైఫల్యం చెందిందా? లేదంటే సాఫ్ట్వేర్ వైఫల్యం జరిగిందా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తుది నివేదిక ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక లోపాలు కారణంగా ఇంజిన్లో ఏదైనా సమస్య తలెత్తిందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తు్న్నారు. ఇక సెక్షన్ల వ్యవధిలోనే ఇంధన నియంత్రణ స్విచ్లను కట్-ఆఫ్ మోడ్లోకి ఎలా వెళ్లాయన్న దానిపై కూడా ఫోకస్ పెట్టారు. విద్యుత్, సాఫ్వేర్ సమస్యలు ఏమైనా తలెత్తాయా? అనే దిశగా లోతుగా పరిశీలిస్తున్నారు. లేదంటే సిస్టమ్-ట్రిగ్గర్డ్ అన్-కమాండ్డ్ ట్రాన్సిషన్ సంభవించి.. ఇంజిన్లు అనుకోకుండా షట్ డౌన్ అయ్యాయా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా కథనాలు వస్తున్నాయి.
ఇది కూాడా చదవండి: Iran: అమెరికా, ఇజ్రాయెల్కు ఖమేనీ వార్నింగ్.. ఈసారి కాలు దువ్వితే..!
అయితే విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వస్తున్నప్పుడు పైలట్.. ‘స్టెబిలైజర్ పొజిషన్ ట్రాన్స్డ్యూసర్ లోపం’ను గుర్తించినట్లుగా ఒక అధికారి మీడియాకు తెలిపారు. ఈ ట్రాన్స్డ్యూసర్ అనేది విమాన నియంత్రణ వ్యవస్థకు సంకేతాలను పంపడం ద్వారా విమానం పిచ్ను నియంత్రించడంలో సహాయపడే సెన్సార్. బోయింగ్ ప్రోటోకాల్ల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడినట్లుగా కూడా సమాచారం ఉన్నట్లు అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విమానంలో అనుకోని ఇంధన కట్-ఆఫ్ సిగ్నల్ కూడా ఉంటుందని సమాచారం. ఆ లోపం వల్లే క్రాష్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. లేదంటే సెన్సార్ వైఫల్యాలకు గురై ఇంజిన్ షట్డౌన్ అయిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇది కూాడా చదవండి: Earthquake: అలస్కాలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఇక కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో.. పైలట్ల్లో ఒకరు మరొకరిని ఎందుకు కట్-ఆఫ్ చేశావని అడుగుతున్నట్లు వినబడింది. మరొక పైలట్ తాను అలా చేయలేదని ప్రతిస్పందించాడు అని ప్రాథిమక నివేదిక తెలిపింది. అయితే విమానంలో 11A దగ్గర కూర్చున్న ప్రయాణీకుడు విశ్వాష్కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు దర్యాప్తు అధికారులతో మాట్లాడుతూ.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద శబ్దం రావడంతో ఆగిపోయిందని చెప్పాడు. ఆకుపచ్చ, తెలుపు లైట్లు మిణుకుమిణుకుమంటున్నాయని పేర్కొన్నాడు. క్రాష్ కాకుండా చూసేందుకు పైలట్లు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా రమేష్ తెలిపాడు. కానీ అంతలోనే కూలిపోయిందని చెప్పాడు. ఇక విమానం కూలిపోక ముందు కేవలం 625 అడుగుల ఎత్తులోనే ఉంది. అదే 3,600–4,900 అడుగుల ఎత్తులో ఉంటే మాత్రం విమానం ప్రమాదానికి గురి కాకుండా నియంత్రించొచ్చు. అందువల్లే పైలట్లకు సాధ్యం కాలేదు.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.
తాజావార్తలు
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?