Internet Users In India: భారత్లో 90 కోట్లను దాటనున్న ఇంటర్నెట్ యూజర్లు.. గ్రామీణులదే ఆధిపత్యం..
- ఈ ఏడాది 90 కోట్లను దాటనున్న ఇంటర్నెట్ యూజర్లు..
- మొత్తం యూజర్లలో గ్రామీణ జనాభాదే ఆధిపత్యం..
- ప్రాంతీయ భాషా కంటెంట్ యూజర్ల పెరుగుదలకు ప్రధాన కారణం..
- ఏఐ వినియోగం కూడా గేమ్ ఛేంజర్..
Internet Users In India: భారతదేశంలో రికార్డు స్థాయిలో ఇంటర్నెట్ యూజర్లు పెరుగుతున్నారు. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లను దాటుతుందని గురువారం ఒక నివేదిక వెల్లడించింది. డిజిటల్ కంటెంట్ కోసం దేశంలోని ప్రాంతీయ భాషల వినియోగం పెరుగుతుండటం ఇంటర్నెట్ యూజర్ల పెరుగుదలకు కారణంగా ఉందని చెప్పింది. ఇండియాలో 2024 నాటికి ఈ సంఖ్య 88.6 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం బలమైన వృద్ధిని సూచిస్తుంది.
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) మరియు కాంటార్ నివేదిక ప్రకారం, 488 మిలియన్ల వినియోగదారులతో గ్రామీణ భారతదేశం ఈ వృద్ధికి నాయకత్వం వహిస్తుంది. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ వినియోగదారులు 55 శాతం వాటాని కలిగి ఉన్నారు. దాదాపుగా అందరు యూజర్లు, అంటే 98 శాతం మంది భారతీయ భాషల్లో కంటెంట్ని యాక్సెస్ చేశారు. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో విస్తృతమైన కంటెంట్ ఉండటం కారణంగా అత్యంత ప్రజాదరణ లభిస్తోంది.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దుండగుడి గుర్తింపు.. ఎలా ఇంట్లోకి వచ్చాడంటే..?
పట్టణ ఇంటర్నెట్ యూజర్లలో సగానికి పైగా అంటే, 57 శాతం మంది ప్రాంతీయ భాషల్లో కంటెంట్ని ఇష్టపడుతున్నారు. ఇది అన్ని ప్లాట్ఫారమ్స్లో స్థానిక భాష కంటెంట్కి పెరుగుతున్న డిమాండ్ని చూపిస్తోందని నివేదిక పేర్కొంది. గతేడాది నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గేమ్ ఛేంజర్గా మారింది. ప్రతీ 10 మంది ఇంటర్నెట్ యూజర్లలో 9 మంది ఏఐ ఎంబెడెడ్ కలిగిన యాప్స్ని వాడుతున్నారు.
“AI చుట్టూ ఉన్న విస్తృత ఆమోదం, ఉత్సాహం భారతదేశంలో మరిన్ని నెక్ట్స్ జనరేషన్ AI లక్షణాలను ప్రవేశపెట్టడానికి డిజిటల్ కంపెనీలను ప్రోత్సహించాలి” అని కాంటార్ ఇన్సైట్స్–దక్షిణాసియా B2B అండ్ టెక్నాలజీ డైరెక్టర్ బిశ్వప్రియ భట్టాచార్య అన్నారు. భారతదేశంలో జెండర్ గ్యాప్ కూడా తక్కుతోందని, మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 47 శాతం మంది మహిళలు ఉన్నారు.
ఓటీటీ వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్, ఆన్లైన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వినియోగం వంటి కార్యకలాపాలతో గ్రామీణ భారతం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ వర్గాలు పట్టణ వినియోగదారుల్ని మించిపోయారు. 2023 మరియు 2024 మధ్య 54 శాతం పెరిగిన స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ స్పీకర్లు వంటి సాంప్రదాయేతర పరికరాల స్వీకరణలో అర్బన్ ఇండియా ముందుంది. ఇదే సమయంలో పట్టణ, గ్రామీణ జనాభాలో ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి మొబైల్ ఫోన్స్ అనేవి ప్రాథమిక మార్గంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!