Indigo Emergency Landing: విమానంలో విషాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo flight makes emergency landing after man starts bleeding mid-air: ఇండిగో విమానంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇండోర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మధురై నుంచి ఢిల్లీకి ఇండిగో విమానం 6E-2088 బయలుదేరింది. అయితే.. మార్గమధ్యంలో అతుల్ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా నోటి నుంచి రక్తం వచ్చింది. ఆ కాసేపటికే అతనున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పైలట్.. ఇండోర్లోని ఇండోర్లోని దేవి అహల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. అనంతరం ఆ ప్రయాణికుడ్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Ashwini Kumar Choubey: ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న కేంద్రమంత్రి
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
ఈ ఘటనపై ఇండిగో ఇన్చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ మాట్లాడుతూ.. అతుల్ గుప్తా అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో విమానాన్ని దారి మళ్లించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనంతరం ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆంబులెన్స్తో పాటు వైద్యుడ్ని సిద్ధం చేశారన్నారు. అయితే.. స్థానిక ఆసుపత్రికి తరలించిన అనంతరం అక్కడి వైద్యుడు అప్పటికే అతుల్ గుప్తా మరణించినట్టు ధృవీకరించారన్నారు. నిజానికి.. అతుల్ గుప్తా అంతకుముందే మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె నొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారని అన్నారు. విమానం గాల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని చెప్పారు. మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల.. న్యూఢిల్లీకి విమానం సాయంత్రం 6:40 గంటలకు చేరుకుందని వెల్లడించారు. మరోవైపు.. మృతుడు నోయిడా నివాసి అని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం తర్రవాత బంధవులకు మృతదేహాన్ని అప్పగిస్తామని పేర్కొన్నారు.
Ranil Wickramasinghe: శ్రీలంక ముందున్న ఏకైక మార్గం అదే.. లేదంటే కోలుకోలేం
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!