Indigo Emergency Landing: విమానంలో విషాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo flight makes emergency landing after man starts bleeding mid-air: ఇండిగో విమానంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇండోర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మధురై నుంచి ఢిల్లీకి ఇండిగో విమానం 6E-2088 బయలుదేరింది. అయితే.. మార్గమధ్యంలో అతుల్ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా నోటి నుంచి రక్తం వచ్చింది. ఆ కాసేపటికే అతనున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పైలట్.. ఇండోర్లోని ఇండోర్లోని దేవి అహల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. అనంతరం ఆ ప్రయాణికుడ్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Ashwini Kumar Choubey: ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న కేంద్రమంత్రి
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ఈ ఘటనపై ఇండిగో ఇన్చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ మాట్లాడుతూ.. అతుల్ గుప్తా అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో విమానాన్ని దారి మళ్లించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనంతరం ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆంబులెన్స్తో పాటు వైద్యుడ్ని సిద్ధం చేశారన్నారు. అయితే.. స్థానిక ఆసుపత్రికి తరలించిన అనంతరం అక్కడి వైద్యుడు అప్పటికే అతుల్ గుప్తా మరణించినట్టు ధృవీకరించారన్నారు. నిజానికి.. అతుల్ గుప్తా అంతకుముందే మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె నొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారని అన్నారు. విమానం గాల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని చెప్పారు. మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల.. న్యూఢిల్లీకి విమానం సాయంత్రం 6:40 గంటలకు చేరుకుందని వెల్లడించారు. మరోవైపు.. మృతుడు నోయిడా నివాసి అని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం తర్రవాత బంధవులకు మృతదేహాన్ని అప్పగిస్తామని పేర్కొన్నారు.
Ranil Wickramasinghe: శ్రీలంక ముందున్న ఏకైక మార్గం అదే.. లేదంటే కోలుకోలేం
తాజావార్తలు
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!