UK: త్రివర్ణ పతాకంతో ఖలిస్తాని మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: విదేశాల్లో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో భారత వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గత రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతని అనుచరులు, బాడీగార్డులను కలిపి 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీసుకుంటున్న ఈ చర్యలపై విదేశాల్లో కూర్చుని ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులకు నచ్చడం లేదు.
తాజాగా లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ముందు నిరసనకు పాల్పడ్డారు. రాయబార కార్యాలయం వెలుపల ఉన్న త్రివర్ణ పతాకాన్ని తీసేశారు. అయితే కొద్ది సేపటికే భారత్ హైకమిషన్ సిబ్బంది, భవనంపై భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ఖలిస్తానీ మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. భారతీయులు ఈ చర్యలను ప్రశంసిస్తున్నారు.
Also Read
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ట్విట్టర్ లో ఈ ఫోటోను పంచుకుంటూ.. ‘‘ఝండా ఊంచా రహే హమారా’’, లండన్ లోని భారత హైకమిషన్ లో భారత జెండాను అగౌరపరిచిన వారిపై యూకే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పంజాబ్, పంజాబీలు అద్భుతమైన చరిత్ర ఉందని.. దేశానికి సేవ చేయడం, దేశాన్ని రక్షిస్తున్నారని అన్నారు. యూకేలో కూర్చున్న కొందరు జంపింగ్ జాక్ లు పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించరని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత హైకమిషన్ చర్యను పలువురు నెటిజన్లు సమర్థించారు. రాయబార కార్యాలయం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసించారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ క్రిస్టినా స్కాట్ ను పిలిచి నిరసన తెలియజేసింది. భారత దౌత్యవేత్తలు, సిబ్బంది పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటనను యూకే విదేశీ కామన్వెల్త్ మంత్రి లార్డ్ తారిక్ అహ్మద్ ఖండించారు. ఈ చర్య దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
Unfazed by the attempts to vandalise the Indian High commission in London by Khalistani extremists, a large Indian flag has been put in front of the mission. https://t.co/lAFJyhA05l pic.twitter.com/0gG2E3tjCi
— Sidhant Sibal (@sidhant) March 19, 2023
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!