UK: త్రివర్ణ పతాకంతో ఖలిస్తాని మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: విదేశాల్లో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో భారత వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గత రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతని అనుచరులు, బాడీగార్డులను కలిపి 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీసుకుంటున్న ఈ చర్యలపై విదేశాల్లో కూర్చుని ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులకు నచ్చడం లేదు.
తాజాగా లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ముందు నిరసనకు పాల్పడ్డారు. రాయబార కార్యాలయం వెలుపల ఉన్న త్రివర్ణ పతాకాన్ని తీసేశారు. అయితే కొద్ది సేపటికే భారత్ హైకమిషన్ సిబ్బంది, భవనంపై భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ఖలిస్తానీ మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. భారతీయులు ఈ చర్యలను ప్రశంసిస్తున్నారు.
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ట్విట్టర్ లో ఈ ఫోటోను పంచుకుంటూ.. ‘‘ఝండా ఊంచా రహే హమారా’’, లండన్ లోని భారత హైకమిషన్ లో భారత జెండాను అగౌరపరిచిన వారిపై యూకే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పంజాబ్, పంజాబీలు అద్భుతమైన చరిత్ర ఉందని.. దేశానికి సేవ చేయడం, దేశాన్ని రక్షిస్తున్నారని అన్నారు. యూకేలో కూర్చున్న కొందరు జంపింగ్ జాక్ లు పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించరని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత హైకమిషన్ చర్యను పలువురు నెటిజన్లు సమర్థించారు. రాయబార కార్యాలయం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసించారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ క్రిస్టినా స్కాట్ ను పిలిచి నిరసన తెలియజేసింది. భారత దౌత్యవేత్తలు, సిబ్బంది పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటనను యూకే విదేశీ కామన్వెల్త్ మంత్రి లార్డ్ తారిక్ అహ్మద్ ఖండించారు. ఈ చర్య దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
Unfazed by the attempts to vandalise the Indian High commission in London by Khalistani extremists, a large Indian flag has been put in front of the mission. https://t.co/lAFJyhA05l pic.twitter.com/0gG2E3tjCi
— Sidhant Sibal (@sidhant) March 19, 2023
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!