UK: త్రివర్ణ పతాకంతో ఖలిస్తాని మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: విదేశాల్లో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో భారత వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గత రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతని అనుచరులు, బాడీగార్డులను కలిపి 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీసుకుంటున్న ఈ చర్యలపై విదేశాల్లో కూర్చుని ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులకు నచ్చడం లేదు.
తాజాగా లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ముందు నిరసనకు పాల్పడ్డారు. రాయబార కార్యాలయం వెలుపల ఉన్న త్రివర్ణ పతాకాన్ని తీసేశారు. అయితే కొద్ది సేపటికే భారత్ హైకమిషన్ సిబ్బంది, భవనంపై భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి ఖలిస్తానీ మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. భారతీయులు ఈ చర్యలను ప్రశంసిస్తున్నారు.
Also Read
బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ట్విట్టర్ లో ఈ ఫోటోను పంచుకుంటూ.. ‘‘ఝండా ఊంచా రహే హమారా’’, లండన్ లోని భారత హైకమిషన్ లో భారత జెండాను అగౌరపరిచిన వారిపై యూకే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పంజాబ్, పంజాబీలు అద్భుతమైన చరిత్ర ఉందని.. దేశానికి సేవ చేయడం, దేశాన్ని రక్షిస్తున్నారని అన్నారు. యూకేలో కూర్చున్న కొందరు జంపింగ్ జాక్ లు పంజాబ్ కు ప్రాతినిథ్యం వహించరని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత హైకమిషన్ చర్యను పలువురు నెటిజన్లు సమర్థించారు. రాయబార కార్యాలయం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసించారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ క్రిస్టినా స్కాట్ ను పిలిచి నిరసన తెలియజేసింది. భారత దౌత్యవేత్తలు, సిబ్బంది పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఘటనను యూకే విదేశీ కామన్వెల్త్ మంత్రి లార్డ్ తారిక్ అహ్మద్ ఖండించారు. ఈ చర్య దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
Unfazed by the attempts to vandalise the Indian High commission in London by Khalistani extremists, a large Indian flag has been put in front of the mission. https://t.co/lAFJyhA05l pic.twitter.com/0gG2E3tjCi
— Sidhant Sibal (@sidhant) March 19, 2023
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!