Internet Economy: ఇది భారత్ డిజిటల్ సత్తా.. 1 ట్రిలియన్ డాలర్లకు చేరనున్న “ఇంటర్నెట్ ఎకానమీ”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Internet Economy: భారతదేశంలో శరవేగంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచిన భారత్, డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇక రాబోయే కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీ, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ఆరు రెట్లు వృద్ధి చెంది ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని, వచ్చే ఏడేళ్లలో కుటుంబాలు తమ ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నాయని గూగుల్, టెమాసెక్ మరియు బైన్ & కంపెనీ నివేదిక పేర్కొంది.
2030లో భారతదేశ జీడీపీలో ఇంటర్నెట్ ఎకానమీ వాటా 4-5 శాతం నుంచి 12-13 శాతానికి పెరుగుతుందని 350 మిలియన్ల డిజిటల్ చెల్లింపు వినియోగదారులు, 220 మిలియన్ల ఆన్లైన్ షాపర్లు ఈ వృద్ధికి కారణమవుతారని నివేదిక పేర్కొంది. భారతదేశ సాంకేతిక రంగానికి ఇంటర్నెట్ ఎకానమీ సహకారం 2022లో 48 శాతం ఉంటే 2030 నాటికి ఇది 62 శాతాని పెరుగుతుందని అంచనాా వేసింది. వినియోగదారుల్లో వచ్చిన మార్పులు, బిజినెస్ ఎకో సిస్టం పరిణామం కారణంగా 2022లో సుమారు 175 బిలియన్ల వినియోగం నుంచి భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ దిశగా దూసుకుపోతుందని ‘ ది ఇ-కానమీ ఆఫ్ ఎ బిలియన్ కనెక్టెడ్ ఇండియన్స్’ నివేదికలో పేర్కొంది.
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
Read Also: Ram Charan: రామ్ చరణ్- అల్లు అర్జున్ కు మధ్య విబేధాలు.. ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ
2030 నాటికి కుటుంబ ఆదాయం 2500 డాలర్ల నుంచి 5,500 డాలర్లకి పెరిగి డబుల్ అవుతుందని అంచనా వేశారు. వినియోగదారులు, పెట్టుబడిదారుల సర్వేతో పాటు బైన్ అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం టైర్ 2+ నగరాలు, టైర్ 1, మెట్రో నగరాలకు సమానంగా డిజిటల్ సేవల డిమాండ్ ఉంటుందని అంచానా వేసింది. బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) ఇ-కామర్స్ డిజిటల్ సేవలలో ప్రముఖ వాటాను కొనసాగిస్తుందని, 2030 నాటికి ఐదు-ఆరు రెట్లు పెరిగి 350-380 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ఇండియాలో ఆన్లైన్ షాపర్లు కూడా రెట్టింపు అవుతారని భావిస్తున్నారు.
ఇండియాలో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు, వ్యాపారాల్లో డిజిటల్ పెట్టుబడులు, ఇండియా స్టాక్ తో డిజిటల్ డెమెక్రటైనేషన్ భారతదేశాన్ని డిజిటల్ పరివర్తన వైపు తీసుకెళ్తుందని, వినియోగ సామర్థ్యం స్టార్ట్-అప్ కంపెనీల విస్తరణకు అవకాశాలను తెరుస్తాయని, భారీ వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు భారతదేశంలో ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థను ఆరు రెట్లు పెరిగేలా చేస్తుందని అంచనా వేసింది.
తాజావార్తలు
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!