Internet Economy: ఇది భారత్ డిజిటల్ సత్తా.. 1 ట్రిలియన్ డాలర్లకు చేరనున్న “ఇంటర్నెట్ ఎకానమీ”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Internet Economy: భారతదేశంలో శరవేగంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచిన భారత్, డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇక రాబోయే కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీ, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ఆరు రెట్లు వృద్ధి చెంది ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని, వచ్చే ఏడేళ్లలో కుటుంబాలు తమ ఆదాయాన్ని రెట్టింపు చేయనున్నాయని గూగుల్, టెమాసెక్ మరియు బైన్ & కంపెనీ నివేదిక పేర్కొంది.
2030లో భారతదేశ జీడీపీలో ఇంటర్నెట్ ఎకానమీ వాటా 4-5 శాతం నుంచి 12-13 శాతానికి పెరుగుతుందని 350 మిలియన్ల డిజిటల్ చెల్లింపు వినియోగదారులు, 220 మిలియన్ల ఆన్లైన్ షాపర్లు ఈ వృద్ధికి కారణమవుతారని నివేదిక పేర్కొంది. భారతదేశ సాంకేతిక రంగానికి ఇంటర్నెట్ ఎకానమీ సహకారం 2022లో 48 శాతం ఉంటే 2030 నాటికి ఇది 62 శాతాని పెరుగుతుందని అంచనాా వేసింది. వినియోగదారుల్లో వచ్చిన మార్పులు, బిజినెస్ ఎకో సిస్టం పరిణామం కారణంగా 2022లో సుమారు 175 బిలియన్ల వినియోగం నుంచి భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ దిశగా దూసుకుపోతుందని ‘ ది ఇ-కానమీ ఆఫ్ ఎ బిలియన్ కనెక్టెడ్ ఇండియన్స్’ నివేదికలో పేర్కొంది.
Also Read
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
- Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
- FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
Read Also: Ram Charan: రామ్ చరణ్- అల్లు అర్జున్ కు మధ్య విబేధాలు.. ఈ ఒక్క ఫోటోతో క్లారిటీ
2030 నాటికి కుటుంబ ఆదాయం 2500 డాలర్ల నుంచి 5,500 డాలర్లకి పెరిగి డబుల్ అవుతుందని అంచనా వేశారు. వినియోగదారులు, పెట్టుబడిదారుల సర్వేతో పాటు బైన్ అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం టైర్ 2+ నగరాలు, టైర్ 1, మెట్రో నగరాలకు సమానంగా డిజిటల్ సేవల డిమాండ్ ఉంటుందని అంచానా వేసింది. బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) ఇ-కామర్స్ డిజిటల్ సేవలలో ప్రముఖ వాటాను కొనసాగిస్తుందని, 2030 నాటికి ఐదు-ఆరు రెట్లు పెరిగి 350-380 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. ఇండియాలో ఆన్లైన్ షాపర్లు కూడా రెట్టింపు అవుతారని భావిస్తున్నారు.
ఇండియాలో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు, వ్యాపారాల్లో డిజిటల్ పెట్టుబడులు, ఇండియా స్టాక్ తో డిజిటల్ డెమెక్రటైనేషన్ భారతదేశాన్ని డిజిటల్ పరివర్తన వైపు తీసుకెళ్తుందని, వినియోగ సామర్థ్యం స్టార్ట్-అప్ కంపెనీల విస్తరణకు అవకాశాలను తెరుస్తాయని, భారీ వ్యాపారాలు, ఎంఎస్ఎంఈలు భారతదేశంలో ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థను ఆరు రెట్లు పెరిగేలా చేస్తుందని అంచనా వేసింది.
తాజావార్తలు
-
Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!