INDIA alliance: ఇండియా కూటమి విచ్ఛిన్నం, కాంగ్రెస్దే బాధ్యత.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఇండియా కూటమిలో విభేదాలు..
- ఇండియా కూటమి విచ్ఛినమైతే కాంగ్రెస్దే బాధ్యత..
- శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA alliance: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభజనకు దారి తీసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విపక్షాలు, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నిలువరించాయి, కానీ అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేదు. 400 సీట్లు అంటూ బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని, కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం చేయగలిగింది ఇండియా కూటమి. అయితే, లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం మరోసారి ఇండియా కూటమి పనితీరుపై అనుమానాలను లేవనెత్తింది. జార్ఖండ్లో గెలిచినప్పటికీ, అక్కడ కాంగ్రెస్ నామమాత్రమే. నిజానికి జార్ఖండ్లో హేమంత్ సోరెన్ పార్టీ జెఎంఎం ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ, ఓట్ల శాతం పరంగా బీజేపీ అన్ని పార్టీల కన్నా ముందుంది.
Read Also: Greenland: గ్రీన్ల్యాండ్ని కొనేందుకు ట్రంప్ ప్లాన్.. వాస్తవానికి ఆ ద్వీపం ఏ దేశానికి చెందినదంటే ?
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ఇదిలా ఉంటే, ఢిల్లీ ఎన్నికల విషయానికి వస్తే ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. అయితే, ఎంపీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీ ఢిల్లీలోని 07 ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఆప్, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ని కాదని, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ వంటి పార్టీలు ఆప్కి మద్దతు ఇస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించామని, తర్వాత ఇండియా కూటమని సజీవంగా ఉంచడానికి ఒక్క సమావేశం జరగలేదని అన్నారు. ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు అందరూ ఇండియా కూటమికి ఇప్పుడు ఉనికి లేదని అంటున్నారని, ప్రజల మనస్సుల్లో అలాంటి భావన వస్తే, కూటమిలోని అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ దీనికి బాధ్యత వహిస్తుందని చెప్పారు. సమన్వయం లేదు, చర్చలు లేవని, దీంతో ఇండియా కూటమిలో అంతా బాగానే ఉందా..? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని రౌత్ చెప్పారు. ఒకసారి ఇండియా కూటమి విడిపోతే మళ్లీ ఇంకెప్పటికీ కలవదని ఆయన జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!