ATM in Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ట్రైన్లో ఏటీఎంలు..
- భారతీయ రైల్వే మరో సంచలన నిర్ణయం..
- ట్రైన్స్ లోనే ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్లాన్..
- ఇప్పటికే ముంబై- మన్మాడ్ ఎక్స్ప్రెస్లో ఏటీఎం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATM in Trains: ఇండియన్ రైల్వే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఇప్పటి నుంచి షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద ఆఫీసుల్లోనే చూసే ఏటీఎం సేవలను.. త్వరలో కదిలే ఏటీఎంలు సైతం రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్లలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే, ప్రయోగాత్మకంగా సెంట్రల్ రైల్వే తొలిసారిగా ముంబై నుంచి మన్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా కదిలే ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు.
Read Also: Pastor Praveen Pagadala: ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ కోసం పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
కాగా, ప్రతి రోజు నడిచే ఈ పంచవటి ఎక్స్ప్రెస్లో.. ఓ ప్రైవేట్ బ్యాంక్కు చెందిన ఏటీఎంను ఏసీ ఛైర్కార్ కోచ్లో ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫిసర్ స్వప్నిల్ నీలా పేర్కొన్నారు. ఏసీ కోచ్లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఈ ఏటీఎంను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి దీనికి షట్టర్ డోర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి కోచ్లో అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్షాప్లో చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: Rashmika : బంధం బలంగా ఉండాలంటే ఒకే ఒక రూల్ చాలు..
అయితే, ముంబై- మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ పత్రి రోజూ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకూ ప్రయాణం కొనసాగిస్తుంది. వీటి మధ్య సుమారు ప్రయాణ దూరం 4.30 గంటలు పడుతుంది. కాగా, ఆ మార్గంలో ఈ రైలు కీలకమైంది. ఈ ట్రైన్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలను అమలు చేస్తున్నారు. త్వరలోనే మిగతా మార్గాల్లోని రైళ్లలోనూ కూడా ఈ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!