Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- పాక్ అణు కేంద్రం ‘‘కిరాణాహిల్స్ ’’ దాడి..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో సంచలనంగా మారిన ఘటన..
- భారత డ్రోన్ ఢీకొట్టినట్లు వెల్లడించిన మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్..
- ఉద్దేశపూర్వకంగా దాడి జరగలేదని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధ కేంద్రంగా ఉన్న ‘‘కిరాణా హిల్స్’’పై దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, దీని గురించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. పాకిస్తాన్ సర్గోధా సమీపంలోని కిరాణా హిల్స్ను భారత్ పంపిన లోయిటరింగ్ మ్యూనిషన్(డ్రోన్) ఢీకొట్టిన విషయం నిజమే అని చెప్పారు. అయితే, కిరాణా హిల్స్ను ఉద్దేశపూర్వకంగా అటాక్ చేయలేదని చెప్పారు.
కిరాణా హిల్స్ ఢీకొట్టడానికి కారణం ఇదే..
రాడార్లను లక్ష్యంగా చేసుకుని పంపింని భారతీయ డ్రోన్, బహుశా ఇజ్రాయిల్ రూపొందించిన హారోప్ డ్రోన్ సర్గోధా చుట్టుపక్కల రాడార్ల కోసం గాలిస్తున్న క్రమంలో ఇంధనం అయిపోయినట్లు జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. ఇప్పటికే ఎయిర్ మార్షల్ ఏకే భారతి కిరాణా హిల్స్ టార్గెట్ జరగలేదని చెప్పారని, ఇప్పుడు తాను కూడా ఇదే వివరణ ఇవ్వగలనని అన్నారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా దాడులకు ముందు సర్గోధా, కిరానా హిల్స్ ప్రాంతాల్లోకి అనేక లోయిటరింగ్ మ్యూనిషన్లను పంపినట్లు ఆయన చెప్పారు. సర్గోధాకు సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన కిరానా హిల్స్ ఉన్నట్లు వివరించారు. నిర్దిష్టమైన ఆపరేషన్ కోసం సమయం ఉంటుందని, సుమారు రెండు గంటల పాటు గాలిస్తుంది, టార్గెట్ కనిపించకుంటే చివరకు ఎక్కడో చోట ఢీకొడుతుంది. ఇలా కిరాణా హిల్స్లోని కొండల్లో ఒక దాన్ని ఢీకొట్టి ఉండొచ్చని చెప్పారు.
Also Read
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
స్కార్దుపై దాడికి అనుమతి, కానీ..
ఆక్రమిత కాశ్మీర్లోని స్కార్డుపై దాడి చేసేందుకు భారత వైమానిక దళానికి అనుమతి ఇచ్చినట్లు జనరల్ చౌహాన్ వెల్లడించారు. అయితే ప్రతికూల వాతావరణం కారనంగా ఆ దాడిని నిలిపేసినట్లు చెప్పారు. దీంతో భోలారిపై దాడి చేశామని చెప్పారు. మే 10న జరిగిన వైమానిక దాడుల్లో భోలారీలోని హ్యాంగర్లపై భారత వైమానిక దళం జరిపిన దాడి అత్యంత కీలకమైందిగా నిలిచింది. ఈ దాడిని గాంధీనగర్లోని సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ నిర్వహించింది. భోలారిలో ఉన్న హ్యాంగర్లతో పాటు రన్వేపై పెద్ద గోతులు ఏర్పడటం అప్పట్లో వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!