UK: లండన్లో ఇండియన్స్ VS ఖలిస్తానీలు.. రాయబార కార్యాలయం ముందు ఉద్రిక్తత..
- యూకేలో భారతీయులు వర్సెస్ ఖలిస్తానీ మూక..
- లండర్ రాయబార కార్యాలయం ముందు ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఖలిస్తానీ మూకలు రెచ్చిపోయాయి. లండన్లోని భారత రాయబార కార్యాలయం వెలుపల గుమిగూడిన కొంత మంది ఖలిస్తానీ మద్దతుదారులు భారత దేశం, భారత సమగ్రతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, అదే సమయంలో రిపబ్లిక్ డే వేడులకు చూసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులు, ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రతిగా నినాదాలు చేశారు. భారతదేశాన్ని కీర్తిస్తూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది ఖలిస్తానీలు భారత జెండాను అవమానించినట్లు భారతీయులు ఆరోపించారు.
Read Also: Minister Savita: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోం.. మంత్రి హెచ్చరిక
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
దీనికి ముందు కంగనా రనౌత్ నటించిన ఎమర్జె్న్సీ సినిమా ప్రదర్శిస్తున్న యూకేలోని సినిమా థియేటర్లలో కొంతమంది ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్గా పరిగణిస్తోంది. భారత వ్యతిరేక, హింసాత్మక శక్తుల నిరసనలు, బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని యూకే ప్రభుత్వాన్ని కోరింది. ఈ శక్తులపై చర్యలు తీసుకోవాలని, భారత్ యూకే ముందు తన ఆందోళనను నిరంతరం తెలియజేస్తోందని, వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని భారత వ్యతిరేక చర్యలకు పాల్పడటాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.
ముఖ్యంగా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గత నెలలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ, అతడి సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) యూకేలో ‘‘కిల్ మోడీ పాలిటిక్స్’’ ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. వెస్ట్ బ్రోమ్విచ్లోని గురుద్వారాలో ప్రధాని మోడీ, ఫారిన్ మినిస్టర్ జైశంకర్ ‘‘కిల్ మోడీ పాలిటిక్స్’’, వాంటెడ్ అంటూ బ్యానర్లను ప్రదర్శించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఖలిస్తానీ వేర్పాటువాదులు లండన్లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. పలు సందర్భాల్లో యూకేకి భారత్ నిరసన తెలిపినప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడం లేదు.
#WATCH | London, UK: Protest by a pro-Khalistan mob outside the Indian High Commission in London was met with counter-protest from the Indian diaspora. pic.twitter.com/emR6UumK0D
— ANI (@ANI) January 26, 2025
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!