Indian Army Chief: లెబనాన్- ఇజ్రాయెల్ యుద్ధంపై భారత ఆర్మీ చీఫ్ రియాక్షన్ ఇదే..!
- హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన పేజర్ బ్లాస్ట్తో ప్రపంచ షాక్..
- చైనాతో సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థితికి ఇంకా రాలేదు..
- ఇప్పటికి బౌర్డర్లో వాతావరణం ఉద్రిక్తతగానే ఉంది: భారత ఆర్మీ చీఫ్ ద్వివేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army Chief: లెబనాన్లో హెజ్బొల్లా శ్రేణులే టార్గెట్ గా ఇజ్రాయెల్ జరిపిన ‘పేజర్ బ్లాస్ట్ ఆపరేషన్’తో ప్రపంచ షాక్ అయిందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆ గ్రూప్ను నిర్వీర్యం చేసే లక్ష్యంతో పేలుడు పదార్థాలతో ఉన్న పేజర్లను పంపేందుకు ఇజ్రాయెల్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు. అదొక మాస్టర్ ప్లాన్ అన్నారు. మనం దాడులు స్టార్ట్ చేసిన రోజు యుద్ధం ప్రారంభమైనట్టు కాదు.. ప్రణాళిక రెడీ చేసిన రోజే యుద్ధం మొదలైనట్టని ద్వివేది పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: ‘పెళ్లి కోసం అంబానీ కోట్లు ఖర్చుపెట్టారు.. అది మీ డబ్బే’
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఇక, ఇజ్రాయెల్ భిన్నంగా ఆలోచన చేసింది అని భారత ఆర్మీ చీఫ్ ద్వివేది చెప్పారు. హమాస్ తమ ప్రధాన లక్ష్యమని నిర్ణయించుకుని దాడి చేసింది.. ఆ తర్వాత టార్గెట్ మార్చి.. పేజర్ల పేలుడుతో భారీ దాడి చేసిందన్నారు. చాణక్య డిఫెన్స్ డైలాగ్ వేదికగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా సమకాలీన అంశాలపై చర్చలు జరిపి జాతీయ, ప్రాంతీయ స్థాయిలో భద్రతాపరమైన సవాళ్లను నవీన సాంకేతికతల సాయంతో పరిష్కరించడానికి కావాల్సిన విధివిధానాలను రూపొందిస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు.
Read Also: Hezbollah: అక్టోబర్ 7 తరహాలో భారీ దాడికి హెజ్బొల్లా ప్లాన్..
అలాగే, భారతదేశ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి.. సాధారణ పరిస్థితి రాలేదన్నారు. చైనా విషయంలో మనం పోటీపడాలి.. పోరాడాలి.. సహకరించాలని కోరారు. మనకు సంబంధించినంత వరకు 2020 నాటి పరిస్థితులు వచ్చే వరకు ఇదంతా సున్నితమైన వ్యవహారమే అని ఆయన తెలిపారు. కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నాం.. చర్చల సమయంలో దౌత్యపరంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ ఇంకా జరగలేదని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి.. మరో సూపర్హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!