Rahul Gandhi: ‘పెళ్లి కోసం అంబానీ కోట్లు ఖర్చుపెట్టారు.. అది మీ డబ్బే’
- బహదూర్ఘర్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రోడ్షో
- బీజేపీపై విరుచుకు పడిన రాహుల్ గాంధీ
- 'పెళ్లి కోసం అంబానీ కోట్లు ఖర్చుపెట్టారు.. అది మీ డబ్బే' అని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీలలో తమ అభ్యర్థుల కోసం అన్ని పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బహదూర్ఘర్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రోడ్షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడి పెళ్లికి కోట్లు ఖర్చు చేశారని, అయితే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు.
READ MORE: Air India Express: ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “అంబానీ పెళ్లి చూశారా.. అంబానీ పెళ్లికి కోట్లు ఖర్చుపెట్టారు.. ఇది ఎవరిది.. ఇది మీ డబ్బు.. మీ పిల్లల పెళ్లి కోసం బ్యాంకులో అప్పు తీసుకుంటారు. నరేంద్ర మోడీ ఇలా చేశారు.. ప్రధాని మోడీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. ఇంతే కాకుండా.. హర్యానాలో ఉన్న ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. గతంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండేది. నేడు అది రూ. 1200 ఉంది. హర్యానా రైతులు తమ ధాన్యానికి మద్దతు ధర రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Adluri Laxman Kumar : నిర్వాసితుల కష్టాలపైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదు..
హర్యానా ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. పేదలకు రూ.3.5 లక్షలతో 100 గజాల ప్లాట్, 2 పడక గదుల ఇల్లు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!