OTT: రూ.12,000 కోట్లకు చేరనున్న ఓటీటీ మార్కెట్.. థియేటర్లకు ఇక కష్టకాలమే..
The growing OTT market is expected to reach Rs.12,000 crore by 2023: ఇండియాలో ఓవర్ – ది- టాప్(ఓటీటీ) వ్యాపారం విస్తరిస్తోంది. ఎస్బీఐ రిసెర్చ్ ప్రకారం 2023 నాటికి ఓటీటీ మార్కెట్ రూ. 11,944 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. 2018లో రూ.2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయాల్లో ప్రజలు ఎక్కువగా ఓటీటీలకు చేరువయ్యారు. 2000 ప్రారంభంలో మల్లీప్లెక్సులు వీసీఆర్/ వీసీడీ బిజినెస్ ను ఎలా దెబ్బతీశాయో.. ప్రస్తుతం ఓటీటీలు, థియేటర్ వ్యాపారాన్ని అలా దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఓటీటీ వినోద పరిశ్రమ వాటా, రాబడిలో 7-9 శాతాన్ని ఆక్రమించింది. ఓటీటీ అన్ని భాషల్లో కంటెంట్ అందిస్తుండటంతో ప్రేక్షకులు వీటికి దగ్గర అవుతున్నారు. అరచేతుల్లో వినోద పరిశ్రమ ఉండటంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తక్కువ అవుతోంది. కంటెంట్ ఉన్న సినిమా వస్తే కానీ థియేటర్ల వైపు వెళ్లడం లేదు జనాలు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతిఘోష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం 45 కోట్ల మంది ఓటీటీ సబ్స్క్రైబర్లు ఉన్నారని.. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని.. 2023 నాటికి ఓటీటీ సబ్స్క్రైబర్లు సంఖ్య 50 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.
Also Read
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
Read Also: Bandi Sanjay: కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి ఇవ్వండి
ఇంటర్నెట్ వేగం పెరగడమూ కారణమే..
ఓటీటీ ఎదుగుదలకు ఇంటర్నెట్ వేగం కూడా ఓ కారణం అవుతుంది. మొబైల్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడం కూడా ఓటీటీ వ్యాపారానికి కలిసి వస్తోంది. ప్రస్తుతం దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో 4-జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇంటర్నెట్ వేగం పెరిగింది. రానున్న కాలంలో 5-జీ కూడా అందుబాటులోకి వస్తోంది.
ప్రస్తుతం డిస్నీ హాట్స్టార్ కి 14 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, అమెజాన్ ప్రైమ్ కి 6 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, నెట్ ఫ్లిక్స్ కి 4 కోట్లు మంది, జీ 5కి 3.7 కోట్లు మంది, సోనీ లివ్ కి 2.5 కోట్లు మంది ఖాతాదారులు ఉన్నారు. తక్కువ ధరలకు సేవలన్ని అందిస్తుండటంతో వీటికి ఖాతాదారులు పెరుగుతున్నారు. యూఎస్ తో పోలిస్తే 70-90 శాతం కన్నా చౌకగా ప్లాన్లను అందిస్తున్నాయి. దీంతో సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు.
50 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు నెలకు 5 గంటల కన్నా ఎక్కువ సమయం ఓటీటీలను ఉపయోగిస్తున్నారని.. దీంతో థియేటర్ లాభాలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీల కోసమే కంటెంట్ సిద్ధం చేస్తున్నారు. వెబ్ సిరీస్ లు, సినిమాలను ఓటీటీల్లోకి తేస్తుండటంతో ఇదే లాభసాటి మార్గమని చాలా మంది గ్రహించారు. సంప్రదాయక ఫిల్మ్ మేకింగ్ కన్నా ఓటీటీలే లాభదాయకం అని గ్రహించిన స్టూడియోలు ప్రత్యేకించి సొంత స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లను ఏర్పాటు చేస్తున్నాయి. రాబోయే కాలంలో విద్య, హెల్త్, ఫిట్ నెస్ వంటివి కూడా ఓటీటీల్లో విస్తరించే అవకాశం ఉంది. దీంతో మరింగా జనాల్లోకి ఓటీటీలు ప్రవేశించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!