Yasin Malik: షాహీద్ ఆఫ్రిది నుంచి ఓఐసీ దాకా అదే తీరు… భారత్ గట్టి జవాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు యూఏపీఏ చట్టం కింది ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశానికి వ్యతిరేఖంగా వ్యవహరించడం వంటి కేసులపై ఇటీవల ఎన్ఐఏ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదిలా ఉంటే కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లోని అక్కడి ప్రభుత్వం, మీడియా, ప్రముఖులు యాసిన్ మాలిక్ శిక్షపై వ్యతిరేఖంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ ఎప్పుడూ కాశ్మీర్ పై నిర్ణయాలు తీసుకున్నా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ)వ్యతిరేఖంగానే స్పందిస్తుంది. మరోసారి యాసిన్ మాలిక్ విషయంలో కలుగజేసుకుంది. దాని అనుబంధ సంస్థ అయిన ఇండిపెండెంట్ పర్మినెంట్ హ్యమన్ రైట్స్ కమిషన్(ఐపీహెచ్ఆర్సీ) యాసిన్ మాలిక్ శిక్షను వ్యతిరేఖించింది.
భారత్ ఓఐసీకి ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ యాసిన్ మాలిక్ శిక్షను తప్పుబట్టడాన్ని ఆమోదించలేనిదిగా అభివర్ణించింది భారత్. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ… ఉగ్రవాదానికి వ్యతిరేఖంగా ప్రపంచం ‘ జీరో టాలరెన్స్’ను కోరుకుంటుందని.. దానికి ఏవిధంగా సమర్థించ వద్దని ఓఐసీని కోరారు. ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ భారతదేశాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ తెలిపింది. మాలిక్ ఉగ్రవాదానికి పరోక్షంగా ఐఓసీ మద్దతు నిచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించ కూడదని.. దానిని ఏవిధంగా సమర్థించవద్దని ఓఐసీని కోరుతున్నట్లు అరిందమ్ బాగ్చీ అన్నారు.
Also Read
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
యాసిన్ మాలిక్ కు శిక్ష పడటాన్ని ఇటీవల పాక్ క్రికెటర్ షాహీద్ ఆప్రిది తప్పు పట్టాడు. కాశ్మీరీ వ్యక్తుల గొంతును ఇండియన్ ప్రభుత్వం అణచివేస్తుందని విమర్శించారు. యాసిన్ మాలిక్ ను ఓ పోరాట యోధుడిగా అభివర్ణించారు ఆఫ్రిది. దీనికి ఇండియన్ నెటిజన్స్ నుంచి భారీగానే కౌంటర్లు వస్తున్నాయి. ముందు మీ దేశాన్ని చూసుకోండంటూ విమర్శలు చేశారు. ఓఐసీలో 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!