కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు యూఏపీఏ చట్టం కింది ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశానికి వ్యతిరేఖంగా వ్యవహరించడం వంటి కేసులపై ఇటీవల ఎన్ఐఏ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదిలా ఉంటే కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లోని అక్కడి ప్రభుత్వం, మీడియా, ప్రముఖులు యాసిన్ మాలిక్ శిక్షపై వ్యతిరేఖంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ ఎప్పుడూ కాశ్మీర్ పై నిర్ణయాలు తీసుకున్నా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ)వ్యతిరేఖంగానే స్పందిస్తుంది. మరోసారి యాసిన్ మాలిక్ విషయంలో కలుగజేసుకుంది. దాని అనుబంధ సంస్థ అయిన ఇండిపెండెంట్ పర్మినెంట్ హ్యమన్ రైట్స్ కమిషన్(ఐపీహెచ్ఆర్సీ) యాసిన్ మాలిక్ శిక్షను వ్యతిరేఖించింది.
భారత్ ఓఐసీకి ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ యాసిన్ మాలిక్ శిక్షను తప్పుబట్టడాన్ని ఆమోదించలేనిదిగా అభివర్ణించింది భారత్. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ… ఉగ్రవాదానికి వ్యతిరేఖంగా ప్రపంచం ‘ జీరో టాలరెన్స్’ను కోరుకుంటుందని.. దానికి ఏవిధంగా సమర్థించ వద్దని ఓఐసీని కోరారు. ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ భారతదేశాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ తెలిపింది. మాలిక్ ఉగ్రవాదానికి పరోక్షంగా ఐఓసీ మద్దతు నిచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించ కూడదని.. దానిని ఏవిధంగా సమర్థించవద్దని ఓఐసీని కోరుతున్నట్లు అరిందమ్ బాగ్చీ అన్నారు.
యాసిన్ మాలిక్ కు శిక్ష పడటాన్ని ఇటీవల పాక్ క్రికెటర్ షాహీద్ ఆప్రిది తప్పు పట్టాడు. కాశ్మీరీ వ్యక్తుల గొంతును ఇండియన్ ప్రభుత్వం అణచివేస్తుందని విమర్శించారు. యాసిన్ మాలిక్ ను ఓ పోరాట యోధుడిగా అభివర్ణించారు ఆఫ్రిది. దీనికి ఇండియన్ నెటిజన్స్ నుంచి భారీగానే కౌంటర్లు వస్తున్నాయి. ముందు మీ దేశాన్ని చూసుకోండంటూ విమర్శలు చేశారు. ఓఐసీలో 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్నాయి.