Sheikh Hasina: షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంపై ఇండియా ఆలోచించాలి.. బంగ్లాదేశ్ పార్టీ నేత..
- షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంపై ఇండియా ఆలోచించాలి..
- ఇరుదేశాల ప్రజలపై ప్రభావం..
- ఒకే పార్టీలో సంబంధాలు పెట్టుకోకూడదు..
- బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ హింస నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్ వచ్చేసింది. యూకేలో ఆమె ఆశ్రయం కోరిందని సమాచారం. అయితే, షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై పలువురు బంగ్లాదేశ్ నేతలు మండిపడుతున్నారు. భారత్ ఒకే పార్టీతో సంబంధాలును కొనసాగించకూడదని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చైర్పర్సన్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ అన్నారు. షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చే ముందు భారత్ ఆలోచించాలని ఆచన అన్నారు. బంగ్లాదేశ్కి భారత్ అతిపెద్ద పొరుగుదేశమని చెప్పారు.
‘‘ షేక్ హసీనాకు ఎవరూ ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదు..? షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేముందు భారత్ ఆలోచించాలి. ఇది ప్రజల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అన్ని దేశాలు మనకు స్నేహంగా ఉండాలి’’ అని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ హింసాకాండలో విదేశీ శక్తుల ప్రమేయం ఉందని భారత మీడియా కథనాలను ప్రచురిస్తోందిని బీఎన్పీ నాయకుడు అన్నారు. బంగ్లాదేశ్ అల్లర్లలో చైనా, పాకిస్తాన్ ఐఎస్ఐ పాత్ర ఉందని భారత మీడియా ఊహాగానాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
Read Also: Kolkata: ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితుడికి 14 రోజుల పోలీస్ కస్టడీ
నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందని, బీఎన్పీ నాయకులు భారత దౌత్యవేత్తలను కలిసినట్లు అలంగీర్ చెప్పారు. నిజానికి బీఎన్పీ చీఫ్ ఖలీదా జియా పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తుంది. అయితే, హసీనా పాలనలో భారత్-బంగ్లా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. హసీనాను ఫాసిస్ట్గా అభివర్ణించిన అలంగీర్, ఆమె అన్ని ప్రభుత్వ వ్యవస్థల్ని రాజకీయం చేశారని అన్నారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని అనుమతించాలని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన కొట్టిపారేశారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న ఒక్క కేసు కూడా ఢాకాలో నమోదు కాలేదని చెప్పాడు. తన నియోజకవర్గంలో 35 శాతం మంది ఓటర్లు మైనారిటీలే అని అక్కడ ఎలాంటి దాడి జరగలేదని చెప్పారు. మాకు వ్యతిరేకంగా కొందరు స్వార్థపరులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని పెట్టుబడులకు రక్షణ ఉంటుందని చెప్పారు. 2009లో అవామీ లీగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ప్రధాని, బీఎన్పీ చీఫ్ ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ లండన్ పారిపోయాడు. ప్రస్తుతం అతను తిరిగి వస్తు్న్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!