India seizes Pak consignment: చైనా నుంచి పాక్ వెళ్తున్న ప్రమాదకర కెమికల్స్ని సీజ్ చేసిన భారత్..
- చైనా నుంచి పాక్ వెళ్తున్న ప్రమాదకరమైన రసాయనాలు..
- సీజ్ చేసిన భారత్.. జీవ రసాయన యుద్ధంలో వాడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India seizes Pak consignment: చైనా నుంచి దాని మిత్రదేశం పాకిస్తాన్ వెళ్తున్న ప్రమాదకరమైన, నిషేధిత జాబితాలో ఉన్న రసాయన పదార్థాలు కలిగిన షిప్మెంట్ని భారత్ సీజ్ చేసింది. తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని కట్టుపల్లి ఓడరేవు వద్ద చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న నౌకను అధికారులు తనిఖీ చేశారు. చైనసీ సంస్థ చెంగ్డు షిచెన్ ట్రేడింగ్ కో. లిమిటెడ్ నుంచి పాకిస్తాన్ రావల్పిండిలోని డిఫెన్స్ సప్లయర్ అయిన రోహైల్ ఎంటర్ప్రైజెస్కి ‘‘ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్’’ సరుకు రవాణా అవుతోందని అధికారులు వెల్లడించారు.
దాదాపుగా 2560 కిలోల బరువున్న ఈ సరుకు ఒక్కొక్కటి 25 కిలోలు కలిగిన 103 డమ్ముల్లో భద్రపరిచారు. 2024 ఏప్రిల్ 18న చైనాలోని షాంఘై పోర్టులోని హ్యుందాయ్ షాంఘై పేరు కలిగిన నౌకలో లోడ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరాచీకి వెళ్లే ఈ ఓడ మే 08, 2024లో కట్టుపల్లి పోర్టుకు చేరుకుంది. భారత ఎగుమతి నియంత్రణ జాబితా ‘SCOMET’లో ఈ కెమికల్ పేరు కూడా ఉంది. దీనిని నియంత్రిత పదార్థంగా గుర్తించి, కస్టమ్స్ అధికారులు దీనిని సీజ్ చేశారు.
Also Read
Read Also: Tata Consultancy Services: టీసీఎస్ తొలి త్రైమాసిక ఆదాయం విడుదల..3నెలల్లో రూ.12000కోట్లు లాభం..
ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్ (CS) పాకిస్తాన్ వెళ్తుందని అధికారులు గుర్తించారు. వాసెనార్ ఒప్పందంలో భాగంగా ఇది నిషేధిత జాబితాలో ఉంది. అయితే, వాసెనార్ ఒప్పందంపై భారత్ సంతకం చేసినప్పటికీ, చైనా-పాకిస్తాన్ సంతకం చేయలేదు. కస్టమ్స్ చట్టం, 1962 మరియు ఆయుధాల మాస్ డిస్ట్రక్షన్ మరియు డెలివరీ సిస్టమ్స్ (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) చట్టం, 2005 కింద ఈ రసాయన సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యంగా టియర్ గ్యాస్, అల్లర్లను నియంత్రించే ఏజెంట్లలో ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు. దీనిని అంతర్జాతీయంగా నిషేధించారు. ఈ ప్రమాదకరమైన పదార్థాన్ని జీవ యుద్ధ కార్యక్రమంలో పాకిస్తాన్ ఉపయోగించే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. మార్చిలో ముంబైలోని నవాషెవా పోర్టులో కూడా పాకిస్తాన్కి వెళ్తున్న అణు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలతో ముడిపడి ఉన్న సరుకును భారత్ అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ సరుకు కూడా చైనా నుంచి కరాచీకి వెళ్తున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!