India seizes Pak consignment: చైనా నుంచి పాక్ వెళ్తున్న ప్రమాదకర కెమికల్స్ని సీజ్ చేసిన భారత్..
- చైనా నుంచి పాక్ వెళ్తున్న ప్రమాదకరమైన రసాయనాలు..
- సీజ్ చేసిన భారత్.. జీవ రసాయన యుద్ధంలో వాడే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India seizes Pak consignment: చైనా నుంచి దాని మిత్రదేశం పాకిస్తాన్ వెళ్తున్న ప్రమాదకరమైన, నిషేధిత జాబితాలో ఉన్న రసాయన పదార్థాలు కలిగిన షిప్మెంట్ని భారత్ సీజ్ చేసింది. తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని కట్టుపల్లి ఓడరేవు వద్ద చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న నౌకను అధికారులు తనిఖీ చేశారు. చైనసీ సంస్థ చెంగ్డు షిచెన్ ట్రేడింగ్ కో. లిమిటెడ్ నుంచి పాకిస్తాన్ రావల్పిండిలోని డిఫెన్స్ సప్లయర్ అయిన రోహైల్ ఎంటర్ప్రైజెస్కి ‘‘ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్’’ సరుకు రవాణా అవుతోందని అధికారులు వెల్లడించారు.
దాదాపుగా 2560 కిలోల బరువున్న ఈ సరుకు ఒక్కొక్కటి 25 కిలోలు కలిగిన 103 డమ్ముల్లో భద్రపరిచారు. 2024 ఏప్రిల్ 18న చైనాలోని షాంఘై పోర్టులోని హ్యుందాయ్ షాంఘై పేరు కలిగిన నౌకలో లోడ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరాచీకి వెళ్లే ఈ ఓడ మే 08, 2024లో కట్టుపల్లి పోర్టుకు చేరుకుంది. భారత ఎగుమతి నియంత్రణ జాబితా ‘SCOMET’లో ఈ కెమికల్ పేరు కూడా ఉంది. దీనిని నియంత్రిత పదార్థంగా గుర్తించి, కస్టమ్స్ అధికారులు దీనిని సీజ్ చేశారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
Read Also: Tata Consultancy Services: టీసీఎస్ తొలి త్రైమాసిక ఆదాయం విడుదల..3నెలల్లో రూ.12000కోట్లు లాభం..
ఆర్థో-క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్ (CS) పాకిస్తాన్ వెళ్తుందని అధికారులు గుర్తించారు. వాసెనార్ ఒప్పందంలో భాగంగా ఇది నిషేధిత జాబితాలో ఉంది. అయితే, వాసెనార్ ఒప్పందంపై భారత్ సంతకం చేసినప్పటికీ, చైనా-పాకిస్తాన్ సంతకం చేయలేదు. కస్టమ్స్ చట్టం, 1962 మరియు ఆయుధాల మాస్ డిస్ట్రక్షన్ మరియు డెలివరీ సిస్టమ్స్ (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) చట్టం, 2005 కింద ఈ రసాయన సరుకును స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యంగా టియర్ గ్యాస్, అల్లర్లను నియంత్రించే ఏజెంట్లలో ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు. దీనిని అంతర్జాతీయంగా నిషేధించారు. ఈ ప్రమాదకరమైన పదార్థాన్ని జీవ యుద్ధ కార్యక్రమంలో పాకిస్తాన్ ఉపయోగించే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. మార్చిలో ముంబైలోని నవాషెవా పోర్టులో కూడా పాకిస్తాన్కి వెళ్తున్న అణు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలతో ముడిపడి ఉన్న సరుకును భారత్ అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ సరుకు కూడా చైనా నుంచి కరాచీకి వెళ్తున్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!