US Pakistan Relations: ట్రంప్ అకస్మాత్తుగా పాకిస్థాన్ ప్రేమలో ఎందుకు పడ్డారు..? భారత మాజీ దౌత్యవేత్తల వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Pakistan Relations: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్లను వైట్ హౌస్లో కలిశారు. ఓవల్ కార్యాలయంలో షాబాజ్, మునీర్లను కలవడానికి ముందు.. ట్రంప్ వారిద్దరినీ ప్రశంసించారు. మునీర్ను కొంచెం ఎక్కువగానే మెచ్చుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ సమావేశం కావడం ఇది రెండవ సారి. ట్రంప్ గతంలో జూన్ 18, 2025న మునీర్ను కలిశారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కాగా.. పాకిస్థాన్పై ట్రంప్ యు-టర్న్ తీసుకోవడంపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
READ MORE: YS Sharmila: మెడలో ఉల్లిపాయల మాల వేసుకున్న షర్మిళ.. అడ్డుకున్న పోలీసులు!
Also Read
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
తాజాగా ఈ అంశంపై అనేక దేశాలకు రాయబారిగా పనిచేసిన భారత మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో వివరించారు. పాకిస్థాన్, కెనడా, పోలాండ్, లిథువేనియాలలో భారత హైకమిషనర్గా పనిచేసిన అజయ్ బిసారియా మాట్లాడుతూ.. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో పాకిస్థాన్ పై మోసం ఆరోపణలు చేశారు. అప్పట్లో తాము పాకిస్థాన్ కు $33 బిలియన్లు ఇచ్చామని, అయితే.. పాకిస్థాన్ అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసిందని ట్రంప్ ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ మునీర్ ను అద్భుతమైన వ్యక్తి అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. మునీర్ ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేశాడు. ఇది మూనీర్ ని మొచ్చుకోవడానికి ప్రధాన కారణమన్నారు.
READ MORE: Pak PM: భారత్తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..
ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాంగ విధానం అమెరికా, చైనా, సౌదీ అరేబియా చుట్టూ తిరుగుతుందని మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా తెలిపారు. చైనా, సౌదీ అరేబియా లాగా అమెరికాను తన గుప్పిట్లోకి తీసుకురావడంలో పాక్ విజయం సాధించిందన్నారు. అమెరికా పాకిస్థాన్కు భారీ పెట్టుబడి ప్యాకేజీని కూడా అందించిందని తెలిపారు. మునీర్ ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడంతో ట్రంప్ మురిసిపోయి.. పాకిస్థాన్ కు ఆఫర్ లు ఇస్తున్నారని తెలిపారు. అయితే, చైనా, అమెరికాలను కలిసి ఉచ్చులో వేసుకునేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్ర త్వరలోనే బెడిసి కొడుతుందని.. ఎక్కువ కాలం పనిచేయదని అజయ్ బిసారియా అభిప్రాయపడ్డారు. చైనా పాకిస్థాన్ కు ప్రధాన మిత్రుడు. ఈ విషయం ఆపరేష్ సిందూర్ సమయంలో స్పష్టంగా అర్థమైంది. కానీ.. అమెరికా చైనాలా కాదు. పాకిస్థాన్ మాత్రం అమెరికా, చైనా ప్రయోజనాలను ఎక్కువ కాలం సమతుల్యం చేసుకోలేదన్నారు.
READ MORE: Pak PM: భారత్తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..
అమెరికా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి మొనాకోలోని ఫ్రాన్స్కు భారత రాయబారిగా పని చేసిన జావేద్ అష్రఫ్ మాట్లాడుతూ.. షాబాజ్-మునీర్ ఇప్పుడు చేస్తున్నది కొత్త కాదు. పాకిస్థాన్ దశాబ్దాలుగా అమెరికాను తన వలలో వేసుకుంటోంది. ఈ రెండు దేశాలే ప్రపంచంలో ఇస్లామిక్ ఛాందసవాదానికి మూలాలు. పాకిస్థాన్ ప్రస్తుతం ట్రంప్ను ఉచ్చులో పడేసినట్లే, బుష్, ఒబామా పరిపాలనలోనూ అదే జరిగింది. మరోవైపు.. అమెరికా పాకిస్థాన్ను చైనా నుంచి దూరం చేయాలని కోరుకుటుంటోంది.” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!