US Pakistan Relations: ట్రంప్ అకస్మాత్తుగా పాకిస్థాన్ ప్రేమలో ఎందుకు పడ్డారు..? భారత మాజీ దౌత్యవేత్తల వివరణ..
US Pakistan Relations: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్లను వైట్ హౌస్లో కలిశారు. ఓవల్ కార్యాలయంలో షాబాజ్, మునీర్లను కలవడానికి ముందు.. ట్రంప్ వారిద్దరినీ ప్రశంసించారు. మునీర్ను కొంచెం ఎక్కువగానే మెచ్చుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ సమావేశం కావడం ఇది రెండవ సారి. ట్రంప్ గతంలో జూన్ 18, 2025న మునీర్ను కలిశారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కాగా.. పాకిస్థాన్పై ట్రంప్ యు-టర్న్ తీసుకోవడంపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
READ MORE: YS Sharmila: మెడలో ఉల్లిపాయల మాల వేసుకున్న షర్మిళ.. అడ్డుకున్న పోలీసులు!
Also Read
తాజాగా ఈ అంశంపై అనేక దేశాలకు రాయబారిగా పనిచేసిన భారత మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో వివరించారు. పాకిస్థాన్, కెనడా, పోలాండ్, లిథువేనియాలలో భారత హైకమిషనర్గా పనిచేసిన అజయ్ బిసారియా మాట్లాడుతూ.. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో పాకిస్థాన్ పై మోసం ఆరోపణలు చేశారు. అప్పట్లో తాము పాకిస్థాన్ కు $33 బిలియన్లు ఇచ్చామని, అయితే.. పాకిస్థాన్ అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసిందని ట్రంప్ ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ మునీర్ ను అద్భుతమైన వ్యక్తి అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. మునీర్ ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేశాడు. ఇది మూనీర్ ని మొచ్చుకోవడానికి ప్రధాన కారణమన్నారు.
READ MORE: Pak PM: భారత్తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..
ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాంగ విధానం అమెరికా, చైనా, సౌదీ అరేబియా చుట్టూ తిరుగుతుందని మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా తెలిపారు. చైనా, సౌదీ అరేబియా లాగా అమెరికాను తన గుప్పిట్లోకి తీసుకురావడంలో పాక్ విజయం సాధించిందన్నారు. అమెరికా పాకిస్థాన్కు భారీ పెట్టుబడి ప్యాకేజీని కూడా అందించిందని తెలిపారు. మునీర్ ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడంతో ట్రంప్ మురిసిపోయి.. పాకిస్థాన్ కు ఆఫర్ లు ఇస్తున్నారని తెలిపారు. అయితే, చైనా, అమెరికాలను కలిసి ఉచ్చులో వేసుకునేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్ర త్వరలోనే బెడిసి కొడుతుందని.. ఎక్కువ కాలం పనిచేయదని అజయ్ బిసారియా అభిప్రాయపడ్డారు. చైనా పాకిస్థాన్ కు ప్రధాన మిత్రుడు. ఈ విషయం ఆపరేష్ సిందూర్ సమయంలో స్పష్టంగా అర్థమైంది. కానీ.. అమెరికా చైనాలా కాదు. పాకిస్థాన్ మాత్రం అమెరికా, చైనా ప్రయోజనాలను ఎక్కువ కాలం సమతుల్యం చేసుకోలేదన్నారు.
READ MORE: Pak PM: భారత్తో కాల్పుల విరమణకు ట్రంప్ సాయం: ప్రధాని షెహబాజ్ షరీఫ్..
అమెరికా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి మొనాకోలోని ఫ్రాన్స్కు భారత రాయబారిగా పని చేసిన జావేద్ అష్రఫ్ మాట్లాడుతూ.. షాబాజ్-మునీర్ ఇప్పుడు చేస్తున్నది కొత్త కాదు. పాకిస్థాన్ దశాబ్దాలుగా అమెరికాను తన వలలో వేసుకుంటోంది. ఈ రెండు దేశాలే ప్రపంచంలో ఇస్లామిక్ ఛాందసవాదానికి మూలాలు. పాకిస్థాన్ ప్రస్తుతం ట్రంప్ను ఉచ్చులో పడేసినట్లే, బుష్, ఒబామా పరిపాలనలోనూ అదే జరిగింది. మరోవైపు.. అమెరికా పాకిస్థాన్ను చైనా నుంచి దూరం చేయాలని కోరుకుటుంటోంది.” అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
-
AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
-
Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
-
Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!