India At UN: రన్ వేలు ధ్వంసమైనా సిగ్గు లేదా.. పాక్పై భారత్ ఆగ్రహం..
- రన్ వేలు ధ్వంసమైన విషయం గుర్తులేదా..
- దీనిని కూడా విజయంగా ఆస్వాదిస్తున్నారా..?
- పాక్ ప్రధానికి భారత్ దిమ్మతిరిగే కౌంటర్..
India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.
Read Also: Trump: లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించండి.. మైక్రోసాఫ్ట్కు ట్రంప్ ఆదేశాలు
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
అయితే, ఈ రోజు పాకిస్తాన్ తీరుపై భారత్ యూఎన్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోత్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం పాకిస్తాన్ విదేశాంగ విధానానికి కేంద్ర బిందువుగా ఉందని అన్నారు. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిన విషయాన్ని భారత్ మరోసారి గుర్తు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ మేము యుద్ధం గెలిచాము. ఈ ప్రాంతంలో శాంతిని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము’’ అని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై భారత్ స్పందిస్తూ… మే 10న పాకిస్తాన్ సైన్యం దాడిని ఆపేయాలని భారత్ ను కోరుకున్న విషయాన్ని గహ్లోత్ గుర్తు చేశారు. పాకిస్తాన్ రన్ వేలు, హ్యాంగర్లు ధ్వంసమైన రుజువలు ఇప్పటికీ ఉన్నాయని, ఇవన్నీ ధ్వంసమైనా పాకిస్తాన్ దానిని ఆస్వాదిస్తోందని ఎద్దేవా చేశారు. నిజంగా పాకిస్తాన్ శాంతిని కోరుకుంటే, వెంటనే ఆ దేశం ఉగ్రవాద శిబిరాలను మూసేయాలని, భారత్ కోరుకునే ఉగ్రవాదుల్ని అప్పగించాలని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!