Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..
- హార్ముజ్ సమ్మిట్కు యూకే ఆతిథ్యం..
- 35 దేశాలతో హార్ముజ్ తెరిచేందుకు చర్చలు..
- చర్చల్లో పాల్గొంటున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Strait of Hormuz: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే సాగుతాయి. దీంతో ఆసియాతో పాటు యూరప్ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.
ఇదిలా ఉంటే, హార్ముజ్ను తెరవడానికి బ్రిటన్ ‘‘హార్ముజ్ సమ్మిట్’’ నిర్వహిస్తుందని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. 35 దేశాలతో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి భారత్కు కూడా యూకే నుంచి ఆహ్మానం అందిందని, 35 దేశాల సమావేశంలో పాల్గొనాలని కోరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. గురువారం సాయంత్రం జరుగనున్న ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి వర్చువల్ (ఆన్లైన్) విధానం ద్వారా పాల్గొంటారని మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Also Read
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
Read Also:Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్పై ట్రంప్ సెటైర్లు..
LPG, LNG, చమురు రవాణాకు ఆటంకం లేకుండా ఉండేందుకు భారత్ ఇరాన్, గల్ఫ్ లోని ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నటత్లు జైస్వాల్ వెల్లడించారు. భారత్కు తన చమురులో 40 %, LNGలో 50%, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)లో 80% ఈ మార్గం గుండానే వస్తోంది. దీంతో ఈ జలమార్గం భారత్కు చాలా అవసరం. ఇదిలా ఉంటే, భారత్ లాంటి మిత్రదేశాలకు హార్ముజ్ తెరిచే ఉంటుందని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది.
మరోవైపు, అమెరికా కూడా హార్ముజ్ తెరిపించడంపై దృష్టి పెట్టింది. హార్ముజ్ లో స్వేచ్చా నౌకాయానానికి చర్యలు తీసుకుంటే ఇరాన్తో కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని అమెరికా చెబుతోంది. మరోవైపు, ట్రంప్ బ్రిటన్, ఫ్రాన్స్లను టార్గెట్ చేస్తూ వారి చమురు అవసరాలు వారే చూసుకోవాలని చెప్పడం గమనార్హం. దమ్ముంటే హార్ముజ్ నుంచి చమురు తెచ్చుకోవాలని సూచించారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా మరియు UAEలతో సహా 35 దేశాలు సముద్ర భద్రతను పునరుద్ధరించడానికి సహకరించుకోవాలని అంగీకరిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేశాయని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ చెప్పారు.
తాజావార్తలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
-
Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్తో సమంత ఫోటోలు వైరల్!
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్కు భారీ దెబ్బ.!
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?