Asaduddin Owaisi: ఓవైసీ ఇంటిపై దాడి.. ‘‘జై శ్రీరాం, భారత్ మాతా కీ జై’’ నినాదాలు..
- ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై దాడి..
- ఇజ్రాయిల్ అనుకూల పోస్టర్లు..
- జై శ్రీరాం
- భారత్ మాతాకీ జై నినాదాలు..
- పోలీసుల నిస్సాహయతను ప్రశ్నించిన ఓవైసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నివాసంపై దుండగులు దాడి చేశారు. గురువారం తన ఇంటిపై దాడి దాడి జరిగినట్లు ఓవైసీ ఆరోపించారు. గుర్తుతెలియని దుండగులు నల్ల ఇంకుతో ధ్వంసం చేశారని చెప్పాడు. ఎక్స్ వేదికగా ఆయన ఢిల్లీ పోలీసులు నిస్సాహయతను గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 34 అశోకా రోడ్లోని తన నివాసం ప్రధాన గేటుపై ఉన్న నేమ్ ప్లేట్పై నల్ల ఇంక్ విసిరిన విజువల్స్ పంచుకున్నారు. నా ఇంటిని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో నేను ఇప్పుడు లెక్కిస్తున్నాను అని ఓవైసీ ట్వీట్ చేశారు.
Read Also: Upcoming CNG Cars: త్వరలో ఇండియా మార్కెట్లో విడుదల కానున్న సీఎన్జీ కార్లు ఇవే..!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఓవైసీ ఇంటి ముందు నేమ్ప్లేట్పై ఐదుగురు వ్యక్తలు ఇజ్రాయిల్ అనుకూల పోస్టర్లు అంటించడం కనిపించింది. ‘‘భారత్ మాతా కీ జై’’, ‘‘జై శ్రీరాం’’ నినాదాలు రాశారు. భారత్ మాతాకీ జై చెప్పకుండా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవానలి దుండగులు రాశారు. దేశంలో 140 కోట్ల మంది కూడా ఇదే పనిచేయాలని వారు రాశారు. ఇలాంటి సంఘటనలను నిరోధించలేకపోయినందుకు ఢిల్లీ పోలీసులపై ఓవైసీ నిరాశ వ్యక్తం చేశారు. అతను తన X పోస్ట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేసాడు. ‘‘ అమిత్ షా ఇది మీ పర్యవేక్షణలోనే జరుగుతోంది. దయచేసి ఎంపీల భద్రతకు హామీ ఇస్తారో లేదో చెప్పంది’’ అని ప్రశ్నించారు. ఇది పిరికి చర్యల అని, దుండగులు నేరుగా నన్ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
‘‘ నా ఇంటిని టార్గెట్ చేస్తు్న్న గుండాలు నన్ను భయపెట్టలేరు. ఈ సావార్కర్ తరహా పిరికి ప్రవర్తను ఆపండి. నన్ను ఎదుర్కోనే వారిగా ఉండండి, సిర విసిరి, కొన్ని రాళ్లు విసిరిన తర్వాత పారిపోకండి’’ అని ట్వీట్ చేశాడు. ఇటీవల పార్లమెంట్లో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఓవైసీ ‘జై పాలస్తీనా’ అని నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల్ని స్పీకర్ రికార్డులను తొలగించాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..