PM Modi: ఇండియా త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి గురువారం అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశంలో చారిత్రాత్మక ప్రసంగం చేశారు. భారతదేశంలో ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ని ప్రస్తావించారు. భారతదేశం అన్ని ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు నిలయం ప్రధాని మోడీ అన్నారు. ‘‘ఇండియాలో 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయి.. 22 అధికారిక భాషలు ఉన్నాయి.. అయినప్పటికీ మేమంతా ఒకే మాటపై ఉంటాము, ప్రతీ 100 మైళ్లకు మా వంటలు దోశ నుంచి ఆలూ పరాటా వరకు మారుతుంటాయి’’ అని ఆయన అన్నారు. నేడు ప్రపంచం భారత్ గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటోందని అన్నారు.
Read Also: Titan Submarine: టైటాన్ ఆచూకీ లభ్యం.. అమెరికన్ కోస్ట్ గార్డ్ వెల్లడి
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
అమెరికా కాంగ్రెస్ లో మాట్లాడటం ఎప్పుడూ గౌరవమే అని.. నేను భారతీయుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ప్రస్తావిస్తూ భారత్ అమెరికా బంధాన్ని AI గా అభివర్ణించారు. భారతదేశ మూలాలు ఉన్న చాలా మంది ఇక్కడ ఉన్నారని.. ఇందులో చరిత్ర సృష్టించిన కమలా హారిస్ కూడా ఇక్కడ ఉన్నారని ఆయన అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారు. అమెరికా అత్యంత పురాతనమైనదని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని హోదాలో తొలిసారిగా అమెరికా సందర్శించిన సమయంలో భారత్ 10వ ఆర్థిక వ్యవస్థగా ఉందని.. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థాగా ఉందని.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతామని.. భారత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!