India-Pakistan: వక్రబుద్ధి మార్చుకోని పాకిస్థాన్.. భారత్ స్ట్రాంట్ కౌంటర్
- ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్..
- కశ్మీర్.. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని లేవనెత్తిన పాక్ ప్రధాని షెహబాజ్..
- పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన భారత దౌత్యవేత్త భవిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: ఎన్నిసార్లు భంగపడినా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఈసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. దీనికి మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్రధాని షెహబాజ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 రద్దుపై అసత్య ప్రచారం చేస్తుందని పేర్కొనింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి పాక్ మాట్లాడటమేంటో అని ప్రశ్నించింది.
Read Also: Bus Accident: ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు
Also Read
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
ఈ ప్రపంచ వేదిక మీద అవాస్తవాలను వినాల్సి వస్తుందని భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ తెలిపారు. పాక్ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. పొరుగు దేశాలపై దాడులకు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది అని ఆమె మండిపడింది. పాకిస్థాన్ మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్మూకశ్మీర్లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది అని ఆరోపించింది. మిలిటరీ సాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో వరల్డ్ వైడ్ గా గుర్తింపుపొందిన పాక్.. భారత్ గురించి మాట్లాడే హక్కు లేదని భవిక హెచ్చరించింది.
ఇక, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో సాధారణ చర్చ సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ జమ్మూకశ్మీర్ విషయాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో పాక్ లోని సమస్యలను వదిలేసిన షరీఫ్.. కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా ప్రసంగించారు. పాలస్తీనా ప్రజల వలే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నట్లు అతడు కామెంట్స్ చేశారు. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని తెలిపారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
-
Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
-
Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!