Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
- జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి
- కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
- విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బుధవారం దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా లాల్ చౌక్ సమీపంలోని కోత్వాల్ గలి ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ అమరుడయ్యారు. మరో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ మృతి
గాయపడిన వారిలో జమ్మూ పోలీసుల ఐఆర్ 3వ బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన చికిత్స పొందుతూ అమరుడయ్యారు. మరో గాయపడిన జవాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
- Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
ఉగ్రవాదుల కోసం భారీ గాలింపు
దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించాయి. ఘటనాస్థలానికి అదనపు బలగాలను మోహరించి ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారు ఒకరా లేదా పలువురు ఉగ్రవాదులా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. సంఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ, దాడి విధానం, స్థానిక సహకారం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది.
దక్షిణ కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్ర ముప్పు
దక్షిణ కాశ్మీర్లో గత కొంతకాలంగా భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు, పారామిలిటరీ దళాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు తరచూ కాల్పులకు పాల్పడుతున్నారు. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
-
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!