Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్కు ఉంది..
- రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం చేయగలదు..
- ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విలీనం చేసుకోకుండా చూడాల్సి ఉంది: డేవిడ్ కామెరూన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్కు ఉందని యూకే మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ తెలిపారు. ప్రస్తుత సంక్షోభ తీవ్రతను ఈ చర్య తగ్గించగలదన్నారు. ఎన్డీటీవీ ప్రపంచ సదస్సు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విలీనం చేసుకోకుండా చూడాల్సి ఉందన్నారు. అదే సమయంలో 2015లో మోడీతో లండన్లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఓ ఘటనను కూడా యూకే మాజీ ప్రధాని గుర్తుకు తెచ్చుకొన్నారు. మా దేశంలో ప్రధాన మంత్రి లేదా పార్టీ నాయకుడు 4,000 మందితో మాట్లాడితే చాలా గొప్పగా భావిస్తాం.. కానీ, ఓ ప్రత్యేక సందర్భంలో వెంబ్లీ స్టేడియంలో ప్రధాని మోడీ ఏకంగా 85,000 మందిని ఉద్దేశించి మాట్లాడారని గుర్తు చేశారు. ఆ సదస్సులో నేను మాట్లాడుతూ.. యూకేకు తొలి మహిళా ప్రధానిని అందించిన కన్జర్వేటివ్ పార్టీనే.. దేశానికి బ్రిటిష్- ఇండియన్ ప్రధానిని కూడా ఇస్తుందనని చెప్పుకొచ్చాను.. నాడు అక్కడే వెనుక వరుసలో కూర్చొన్న కుర్రాడు రిషి సునాక్ ప్రధాని అవుతారని నాకు కూడా తెలియదని డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు.
Read Also: Bhatti Vikramarka: పవర్ కట్ పై ప్రభుత్వం ఫోకస్.. అత్యవసర సేవలకు ప్రత్యేక వాహనాలు
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ఇక, యుద్ధంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ శుక్రవారం రియాక్ట్ అయ్యారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేమని తెలిపాడు. అదే సమయంలో రష్యా యుద్ధంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ నేడు మాస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని.. పశ్చిమ దేశాలు లేని గ్రూపని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను పుతిన్ సమర్థించారు. రష్యా అధ్యక్షతన కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మిట్ కొనసాగనుంది. ఈ సందర్భంగా సభ్య దేశాల అధినేతలతో భారత ప్రధాన మంత్రి ద్వైపాక్షిక చర్చించనున్నారు. ఏడాది వ్యవధిలో మోడీ రష్యాలో పర్యటించడం ఇది సెకండ్ టైం.
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..