Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్కు ఉంది..
- రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం చేయగలదు..
- ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విలీనం చేసుకోకుండా చూడాల్సి ఉంది: డేవిడ్ కామెరూన్
Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్కు ఉందని యూకే మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ తెలిపారు. ప్రస్తుత సంక్షోభ తీవ్రతను ఈ చర్య తగ్గించగలదన్నారు. ఎన్డీటీవీ ప్రపంచ సదస్సు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విలీనం చేసుకోకుండా చూడాల్సి ఉందన్నారు. అదే సమయంలో 2015లో మోడీతో లండన్లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన ఓ ఘటనను కూడా యూకే మాజీ ప్రధాని గుర్తుకు తెచ్చుకొన్నారు. మా దేశంలో ప్రధాన మంత్రి లేదా పార్టీ నాయకుడు 4,000 మందితో మాట్లాడితే చాలా గొప్పగా భావిస్తాం.. కానీ, ఓ ప్రత్యేక సందర్భంలో వెంబ్లీ స్టేడియంలో ప్రధాని మోడీ ఏకంగా 85,000 మందిని ఉద్దేశించి మాట్లాడారని గుర్తు చేశారు. ఆ సదస్సులో నేను మాట్లాడుతూ.. యూకేకు తొలి మహిళా ప్రధానిని అందించిన కన్జర్వేటివ్ పార్టీనే.. దేశానికి బ్రిటిష్- ఇండియన్ ప్రధానిని కూడా ఇస్తుందనని చెప్పుకొచ్చాను.. నాడు అక్కడే వెనుక వరుసలో కూర్చొన్న కుర్రాడు రిషి సునాక్ ప్రధాని అవుతారని నాకు కూడా తెలియదని డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు.
Read Also: Bhatti Vikramarka: పవర్ కట్ పై ప్రభుత్వం ఫోకస్.. అత్యవసర సేవలకు ప్రత్యేక వాహనాలు
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ఇక, యుద్ధంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ శుక్రవారం రియాక్ట్ అయ్యారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేమని తెలిపాడు. అదే సమయంలో రష్యా యుద్ధంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక, 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ నేడు మాస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని.. పశ్చిమ దేశాలు లేని గ్రూపని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను పుతిన్ సమర్థించారు. రష్యా అధ్యక్షతన కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మిట్ కొనసాగనుంది. ఈ సందర్భంగా సభ్య దేశాల అధినేతలతో భారత ప్రధాన మంత్రి ద్వైపాక్షిక చర్చించనున్నారు. ఏడాది వ్యవధిలో మోడీ రష్యాలో పర్యటించడం ఇది సెకండ్ టైం.
తాజావార్తలు
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!