Mohan Bhagwat: రామమందిర ప్రతిష్ఠాపన రోజున భారత్కి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది..
- భారత్కి నిజమైన స్వాతంత్య్రం రామమందిర ప్రతిష్ఠాపన రోజే వచ్చింది..
- భారతదేశంలో హిందువులను మేల్కొల్పడానికి రామ మందిర ఉద్యమం..
- రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశంలో ఎలాంటి విభేదాలు లేవు: మోహన్ భగవత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన రోజునే భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందుకే ప్రతిష్ఠాపన రోజును ‘ప్రతిష్ఠా ద్వాదశి’గా జరుపుకోవాలన్నారు. భారత్ శత్రువులతో ఎన్నో శతాబ్దాల పాటు పోరాడింది.. రామమందిర ఉద్యమం ఎవరినీ వ్యతిరేకించడానికి ప్రారంభించింది కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక, దేశం తనను తాను మేలుకొల్పుకోవడానికి చేసింది మాత్రమే అన్నారు. తద్వారా భారత్ తన కాళ్లపై నిలిచి ప్రపంచానికి మార్గం చూపిస్తుందన్నారు. రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశంలో ఎలాంటి విభేదాలు కనిపించలేవని మోహన్ భగవత్ తెలిపారు.
Also Read
ఇక, రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర టస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్కి ‘దేవీ అహల్య అవార్డు’ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఇండోర్లో ఏర్పాటు చేసిన అవార్డు అందజేత కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. చంపత్ రాయ్ ఈ అవార్డును.. రామమందిర ఉద్యమంలో పాల్గొన్న వారికి, మందిర నిర్మాణానికి కృషి చేసిన వారికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, గతేడాది జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఇంకో ఎనిమిది రోజుల్లో ఈ కార్యక్రమం జరిగి సంవత్సరం పూర్తి కావొస్తుంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ట్రెండింగ్
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!